Balayya-NTR : ఒకే వేదిక పై నందమూరి హీరోలు ?

నందమూరి హీరోలు బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ లను ఒకే వేదిక పై చూడాలని వారి అభిమానులు పరితపిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు నందమూరి హరికృష్ణ చనిపోయిన తర్వాత, అరవింద సమేత సక్సెస్ మీట్ ఈవెంట్లో కనిపించారు. అలాగే, ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్, 118 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు. వీటి తర్వాత మళ్లీ ఎక్కడ కనిపించింది లేదు. అయితే త్వరలోనే నందమూరి అభిమానులకు ఆ అవకాశం లభిస్తుందని తెలుస్తుంది.

అసలు విషయం ఏంటంటే, కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జూలై చివర్లో కానీ, ఆగస్టు మొదటి వారంలో కానీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయట. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి బాలకృష్ణ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలకు ఎన్టీఆర్ ఖచ్చితంగా హాజరవుతాడు. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు