Baby leaks: ఆ డైరెక్టర్ పాము లాంటివాడు.. మోసం చేశాడు- గాయత్రీ గుప్తా..!

Baby leaks: గాయత్రీ గుప్తా.. తాజాగా సెన్సేషనల్ అయిపోయిందనే చెప్పాలి.. హీరోయిన్స్ అవకాశాల కోసం పడుకుంటున్నారు అని చెప్పి వైరల్ గా మారిన ఈమె…ఇప్పుడు మరొకసారి బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ పాము లాంటివాడు అంటూ హాట్ బాంబ్ పేల్చింది. ఇక అసలు విషయంలోకి వెళితే ఇప్పుడు సాయి రాజేష్ తమను మోసం చేశాడు అంటూ బేబీ లీక్స్ పేరుతో ఒక బుక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అసలు ఏంటీ బేబీ లీక్స్ .. ? సాయి రాజేష్ ఎందుకు మోసం చేశాడు..? అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా చదివి తెలుసుకుందాం..

బేబీ లీక్స్ తో సాయి రాజేష్ గుట్టు రట్టు..

baby-leaksthat-director-is-like-a-snake-he-cheated-gayatri-gupta
baby-leaksthat-director-is-like-a-snake-he-cheated-gayatri-gupta

బేబీ సినిమా కథ నాదే అంటూ షార్ట్ ఫిలిం డైరెక్టర్, సినిమా ఆటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ గత కొన్ని రోజులుగా పోరాడుతున్నారు.. వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో, ఆనంద్ దేవరకొండ విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు.. అయితే ఈ కథ మొత్తం తనదే అంటూ తన ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ బేబీ సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ విషయంపై సాక్షాలతో సహా సాయి రాజేష్ మీద బేబీ లీక్స్ (https://babyleaks2023.blogspot.com/) అనే ఒక బుక్ ని కూడా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చాడు శిరిన్ శ్రీరామ్. సాయి రాజేష్ మోసం చేశాడని .. అందుకు సంబంధించిన సాక్షాలను ఈ బేబీ లీక్స్ లో ఉన్నాయంటూ పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది..

సాయి రాజేష్ మోసాన్ని బయటపెట్టిన గాయత్రి గుప్తా..

అయితే ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నటి గాయత్రి గుప్తా కూడా రియాక్ట్ అయింది.. ఫిదా సినిమాతో పాపులర్ అయిన ఈమె ఐస్ క్రీమ్ 2, మిఠాయి, కొబ్బరిమట్ట వంటి సినిమాలలో నటించింది.. ఇక ఇప్పుడు గాయత్రి కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్ శ్రీరామ్ రాసుకున్నారు.. దానిని సాయి రాజేష్ కాపీ కొట్టేశాడు.. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా నన్నే అనుకున్నారు అందుకు ఆడిషన్ కూడా జరిగింది . స్కూల్ డ్రెస్ లో ఉన్న ఆ ఫోటోలను నేను సాయి రాజేష్ కి చూపించాను… దానిని బేబీలో కాపీ కొట్టేశాడు.. ట్రైలర్ విడుదల అయ్యాక చూసి.. నేను షాక్ అయ్యాను.. నిజానికీ సాయి రాజేష్ తో ఇబ్బందులు నాకు కొత్త ఏమీ కాదు.. ఆయన దర్శకత్వం వహించిన కొబ్బరి మట్ట సినిమాలో కూడా నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు… కొబ్బరి మట్ట సినిమాకు రూ .3లక్షలు ఇస్తానని చెప్పి.. రూ .25, 000 చేతిలో పెట్టాడు..

- Advertisement -

శిరిన్ శ్రీరామ్ కు న్యాయం జరగాలి – గాయత్రీ గుప్తా

ఇప్పుడు బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్.. కానీ ఆ కథను తానే క్రియేట్ చేశానని మోసం చేస్తున్నాడు.. ఇద్దరు కలిసి ఆ కథతో సినిమా తీద్దామని చివరి క్షణంలో బడ్జెట్ లేదని తెలివిగా తప్పించాడు.. అదే కథను కాపీ కొట్టి గీత ఆర్ట్స్ తో చర్చలు జరిపి సినిమాను తెరకెక్కించడం జరిగింది.. నిజంగా గీత ఆర్ట్స్ చాలా మంచి సంస్థ.. కానీ ఈ పాము లాంటి సాయి రాజేష్ ని నమ్మి మోసపోవడం బాధాకరం.. ముఖ్యంగా బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్ పోస్టర్ ను చెప్పులతో కూడా కొట్టారు.. అంతలా ఆయన పబ్లిసిటీ ఉపయోగించుకున్నాడు.. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్ కి మచ్చగా మిగిలిపోతాడు .. శిరిన్ శ్రీరామ్ కు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు