Allu Arjun – Trivikram Movie Update : బన్నీ, త్రివిక్రమ్ మూవీ ఆగిపోలేదు… ఇదుగో ప్రూఫ్

ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే అన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా బన్నీ లేటెస్ట్ సినిమాలకు సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 11 గంటలకు పుష్ప 2 టీజర్ రాగా, అందులోని జాతర సన్నివేశాలు ఫ్యాన్స్ ను అబ్బుర పరిచాయి. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా అప్డేట్ తెరపైకి వచ్చింది. మరి ఇప్పటిదాకా ఆగిపోయింది అనుకుంటున్న ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది అనడానికి సాక్ష్యం ఏంటి? ఇంతకీ ఆ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లది అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పొచ్చు. జులాయితో మొదలైన వీరి బాక్స్ ఆఫీస్ దండయాత్ర ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న కాంబోగా నిలిచింది. అలా వైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, అటు త్రివిక్రమ్ ఇటు బన్నీ కెరీర్లో స్పెషల్ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ కాంబోలో నాలుగవ మూవీ రాబోతుందని కొన్ని నెలల క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్ గా త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ విషయంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా వీరిద్దరి కాంబోలో రావాల్సిన ప్రాజెక్ట్ గుంటూరు కారం మూవీ రిజల్ట్ కారణంగా క్యాన్సిల్ అయ్యిందంటూ ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ బయటకు రాగా బన్నీ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

త్రివిక్రమ్ స్పెషల్ విషెస్…

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలిపింది. ప్రొడక్షన్ నెంబర్ 8 పేరుతో అల్లు అర్జున్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ “ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఏదైనా సాధించగల పట్టుదల అంకితభావం ఉన్న అద్భుతమైన నటుడు స్టైలిష్ ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత మా అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో మళ్ళీ కలిసి పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సార్” అంటూ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి కాంబోలో రావాల్సిన ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వలేదన్న విషయం పై క్లారిటీ వచ్చింది. ఈ మూవీకి ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని, హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి అటకెక్కింది అనుకున్న ప్రాజెక్ట్ ఇంకా ట్రాక్ లోనే ఉందన్న విషయాన్ని అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బయట పెట్టారు మేకర్స్. ఈ మూవీతో గురూజీ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడం ఖాయం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో ?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు