Allu Aravind : ఫోకస్ ఆహా పైనే ?

టాలీవుడ్ లో అగ్ర ప్రొడ్యూసర్ లలో అల్లు అరవింద్ ముందు వరుసలో ఉంటారు. నిర్మాత గానే కాకుండా కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉంటాడు. అల్లు అరవింద్ ఒక సినిమా వెనక ఉన్నారంటే, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని అంతా నమ్ముతారు. అల్లు అరవింద్ జడ్జిమెంట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో కానీ, ప్రేక్షకుల్లో కానీ నమ్మకం కాస్త ఎక్కువే ఉంటుంది.
జి ఎ2 పిక్చర్స్ లో నిర్మించే సినిమాలపై కూడా అల్లు అరవింద్ స్పెషల్ ఫోకస్ పెడతారు. గీత గోవిందం, భలే భలే మగాడివోయ్, టాక్సీ వాలా వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి అంటే అల్లు అరవింద్ జడ్జిమెంట్ పై ఎంత నమ్మకం ఉందేనేది అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ మధ్య కాలంలో అరవింద్ సినిమాల పై ఫోకస్ పెట్టడం లేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న బ్యానర్ నుండి వచ్చే సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆహా ఓటీటీ పైనే అరవింద్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్ లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయ్యింది. కానీ, గీత గోవిందం, భలే భలే మగాడివోయ్ రేంజ్ లో కాదు. అందుకే ఇలాంటి కామెంట్స్ ఎక్కువయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు