ప్రభాస్ హీరోగా , హిందీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న “ఆదిపురుష్” సినిమా విడుదలకి సిద్దమైంది. వాల్మీకి రాసిన ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాముడిగా ప్రభాస్ , సీతగా కృతి సనన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు
చాలా రోజుల ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 3డి, విఎఫ్ఎక్స్ కారణంగా రిలీజ్ ఆలస్యం అయింది. అయితే ఆ మధ్య అన్ని పనులు ముగించుకొని సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. చాలా తక్కువ టైంలో సినిమాను కంప్లిట్ చేసి రిలీజ్ చేస్తున్నారు అని అందరు మూవీ టీమ్ ని ప్రశంసించారు. అప్పుడే సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేసారు. అప్పుడు అర్థమైంది అంత తక్కువ సమయం లో సినిమా ఎలా పూర్తి చేయగలిగారో. 500 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఇంత చీప్ క్వాలిటీ గ్రాఫిక్స్ యూస్ చేస్తారా అంటూ ప్రశంచిన వాళ్లే తిట్టడం స్టార్ట్ చేసారు.
రామాయణం లాంటి ఇతిహాసానికి మీరు ఇచ్చే విలువ ఇదేనా అంటూ కామెంట్ చేయడంతో ఆదిపురుష్ టీం సినిమా రిలీజ్ ని వాయిదా వేసి మళ్ళీ విఎఫ్ఎక్స్ పై వర్క్ చేయడం స్టార్ట్ చేసారు. అయితే సినిమా రిలీజ్ దగ్గరికి వస్తున్న కూడా విఎఫ్ఎక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది మాత్రం ఆదిపురుష్ టీం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
అయితే లేటెస్ట్ గా ఆదిపురుష్ సినిమా ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది. కానీ సినిమా అవుట్ ఎలా వచ్చింది అనే విషయం పై గందరగోళంగానే ఉంది. కానీ ఇటీవలే లీకైన ఆదిపురుష్ బిఫోర్ , ఆఫ్టర్ స్టిల్స్ వైరలయ్యాయి. వాటిని బట్టి చూస్తే గ్రాఫిక్ వర్క్ చాలా బాగా చేసారు అన్నట్టు తెలుస్తుంది. మరి కంప్లిట్ సినిమా ఇలాగే ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 13న రిలీజ్ అవబోతుంది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.