Devi Sri Prasad: ఇండస్ట్రీ@25.. దేవీశ్రీ కల నెరవేరిందా..?

తన సంగీత ప్రపంచంలో శ్రోతలను మైమరిపింపచేసే అతి తక్కువ మంది సంగీత దర్శకులలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరు.. టాలీవుడ్ రాక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఆడియన్స్ కి పరిచయమై మార్చి 12 నాటికి 25 సంవత్సరాలు అవుతోంది.. 1999 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో పాము ఇతివృతంగా తెరకెక్కిన చిత్రం దేవి.. ఈ సినిమాతో దేవిశ్రీప్రసాద్ తన మ్యూజికల్ జర్నీని మొదలుపెట్టారు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న దేవిశ్రీప్రసాద్ ఆ తర్వాత ఆనందం, కలుసుకోవాలని , సొంతం వంటి మ్యూజికల్ మూవీస్ తో మ్యూజికల్ లవర్స్ ని మెస్మరైజ్ చేసి.. తన అభిమానులుగా మార్చుకున్నారు. ఇక తర్వాత ఖడ్గం, వర్షం వంటి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకొని టాలీవుడ్ నిర్మాతలు దృష్టిలో పడ్డారు అలా మొదలైన దేవిశ్రీప్రసాద్ ప్రయాణం నేడు తమిళ్, హిందీ భాషల్లో కూడా కొనసాగుతూ రాక్ స్టార్ అనే బిరుదును అందించింది..

పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్..
ఇక దాదాపు తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో వున్న స్టార్ హీరోల సినిమాలకి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.. తన రాకింగ్ మ్యూజిక్ తో, ఎనర్జీతో స్టార్ హీరో రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ లో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాలకు సంగీతం అందిస్తూ మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా కంపోజర్ , సింగర్ , డాన్సర్ గా కూడా ఎంటర్టైన్ చేస్తున్న ఈయన నిన్నటితో ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు అభిమానులు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కల నెరవేరింది..
ఇదిలా ఉండగా ఈ అద్భుతమైన రోజుని దేవిశ్రీప్రసాద్ మరింత స్పెషల్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది.. తన గురువు మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా అంటే దేవిశ్రీకి ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు… ఆయన స్ఫూర్తితోనే ఇంత గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగాను అని చెబుతూ ఉంటారు.అంతేకాదు తన స్టూడియోలో ఇళయరాజా భారీ ఫోటోని పెట్టుకుని రోజూ ఆరాధిస్తుంటారు దేవిశ్రీప్రసాద్.. జీవితంలో ఎప్పుడైనా ఇళయరాజా తన స్టూడియోకి వస్తే ఆ పిక్చర్ ముందు ఫోటో దిగాలని కూడా కలలుగంటూ ఉంటారు.. అయితే ఎట్టకేలకు ఆ కల ఇన్నేళ్ల తర్వాత నిజమైంది.. రీసెంట్గా దేవిశ్రీ స్టూడియోని ఇళయరాజా సందర్శించారు.. దీంతో దేవిశ్రీ తన ఇన్నాళ్ళ ఆ చిన్న కలని ఒక ఫోటోతో తీర్చేసుకున్నారని చెప్పవచ్చు..

- Advertisement -

ఫొటోస్ వైరల్..
అంతేకాదు ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఇళయరాజా ఫోటో దగ్గర ఇళయరాజా తో ఫోటో దిగి దానిని షేర్ చేయడం గమనార్హం.. అలాగే తనకి అవకాశాలు ఇస్తూ ఇంతటి వాడిని చేసిన నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను ఆదరిస్తున్న అభిమానులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు దేవిశ్రీప్రసాద్. ఇకపోతే ప్రస్తుతం ఈయన షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు