HBD Karan Johar : బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఈరోజు తన 52వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ బీటౌన్ బడా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం.
కరణ్ జోహార్ కార్స్ కలెక్షన్
ప్రస్తుతం పెద్ద ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా బాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్నారు కరణ్ జోహార్. నార్త్ నుంచి సౌత్ దాకా ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని కరణ్ 1972న మే 25న జన్మించారు. తన నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్పై అనేక అద్భుతమైన చిత్రాలను నిర్మించి బాలీవుడ్లో ప్రముఖ చిత్ర దర్శక-నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు పరిశ్రమలో స్టార్ కిడ్స్ ను లాంచ్ చేయాలి అంటే కేరాఫ్ అడ్రస్ కరణ్ జోహార్. ఎందరో సెలబ్రిటీ పిల్లలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనది. చిత్ర పరిశ్రమలో ఆయనకు మంచి పేరుంది. అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో ఆయన కూడా ఒకరు. చాలా మంది తమ ఆస్తుల గురించి ఆరా తీస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ.
ఇక కరణ్కి కూడా లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన గ్యారేజీలో పలు కాస్ట్లీ, లగ్జరీ కార్లు ఉన్నాయి.
- రూ. 2 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ క్లాస్
- రూ. 88 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ 350డి
- రూ. 1.20 కోట్ల విలువైన జాగ్వార్ ఎక్స్జె ఎల్
- రూ. 60 లక్షలు బిఎమ్డబ్ల్యూ 5 సిరీస్ 520డి
- అలాగే ఆయన దగ్గర ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది.
స్వంత నిర్మాణ సంస్థ
కరణ్ జోహార్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘ధర్మ ప్రొడక్షన్స్’ ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించారు. బాలీవుడ్లోని అత్యంత సంపన్న నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు. మీడియా కథనాల ప్రకారం కరణ్ మొత్తం ఆస్తుల విలువ రూ.1,700 కోట్లు. ఇక కరణ్ తన ప్రసిద్ధ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఒక్కో ఎపిసోడ్ కు రూ. 1-2 కోట్లు సంపాదిస్తాడు. ఒక్క యాడ్ కోసం 2 కోట్లు వసూలు చేస్తాడు. దర్శకత్వానికి గాను రూ.5 కోట్లు అందుకుంటున్నాడు. ఏడాదికి 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు.
కరణ్ ఆస్తులు
కరణ్ దగ్గర ఈ ఖరీదైన కార్లతో పాటు విలాసవంతమైన ఆస్తులు కూడా ఉన్నాయి. ముంబైలోని కార్టర్ రోడ్లో సముద్ర తీరంలో ఉన్న ఆయన బంగ్లా ధర కోట్లలో ఉంటుంది. కరణ్ ఈ ఇంటిని 2010లో రూ.32 కోట్లకు కొనుగోలు చేశారు. కరణ్కి మలబార్ హిల్స్లో విలాసవంతమైన ఇల్లు ఉంది. ఈ ఇంటి ధర రూ.20 కోట్లు. అంతేకాకుండా చాలా చోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి.
కరణ్ జువెలరీ బిజినెస్
కరణ్ జోహార్ కూడా ఆభరణాల వ్యాపారంలో కూడా ఉన్నారు. అతను 2021లో ‘థియానీ జ్యువెలరీ’ని ప్రారంభించాడు. ఇప్పటికే ముంబైలో దీనికి సంబంధించి రెండు బ్రాంచెస్ ఉన్నాయి. త్వరలో భారతదేశం అంతటా వ్యాపారాన్ని విస్తరించాలని ఆశిస్తున్నాడు. రెస్టారెంట్ వ్యాపారంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. దీనికి కరణ్ జోహార్ మినహాయింపు కాదు. అతనికి దక్షిణ ముంబైలో రెస్టారెంట్ ఉంది.