సినీ పరిశ్రమలో ఒక సినిమా మొదలు పెట్టిన తర్వాత ఆ సినిమాలో పని చేయాలని అనుకున్న టెక్నీషియన్లు, నటీనటులు పలు రీజన్స్ తో మూవీ నుంచి తప్పుకోవడం సర్వసాధారణమే. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ తాజాగా టాలీవుడ్ పరిశ్రమలో చోటు చేసుకున్న ఒక అంశం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే…
“విశ్వంభర” నుంచి రైటర్ అవుట్
ఒక స్టార్ రైటర్ మెగాస్టార్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన మరెవరో కాదు రైటర్ సాయి మాధవ్ బుర్రా. ప్రస్తుతానికి సాయి మాధవ్ బుర్రా దాదాపు ఎక్కువగా బడా ప్రాజెక్ట్స్ కే వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా చిరు వంటి పెద్ద హీరోల సినిమాలకు డైలాగ్స్ అందిస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “విశ్వంభర”కు కూడా రైటర్ గా వ్యవహరించారు. కానీ తాజాగా ఈ సినిమా నుంచి సాయి మాధవ్ తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇదే రీజనా?
ఆయన ఎందుకు తప్పుకున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సాయి మాధవ్ బుర్రా ఖాతాలో ఎక్కువగా ఫ్లాప్ సినిమాలు పడుతున్నాయి కాబట్టి తప్పించారనే ప్రచారం జరుగుతుంది. ఆయన ఈ మధ్యకాలంలో చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పాటు డైలాగ్స్ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తున్న నేపథ్యంలోనే ఆయన్ని తప్పించారు అనే టాక్ నడుస్తోంది. కానీ అసలు విషయం అది కాదని చెబుతున్నారు సాయి మాధవ్ సన్నిహితులు. ఆయన ఈటీవీ విన్ కోసం ప్రస్తుతానికి పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈనాడు సంస్థ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఓటిటి కోసం తెలుగు కంటెంట్ క్రియేట్ చేయడం కోసం సాయి మాధవ్ బుర్రని కన్సల్ట్ అయ్యారని, అందుకు ఆయన ఒప్పుకుని ముందుకు వచ్చారని చెబుతున్నారు. ఈటీవీ విన్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడం, ఆల్రెడీ ఎవరైనా క్రియేట్ చేసుకుని వస్తే దాన్ని ఫైనల్ చేసి పంపడం లాంటి వ్యవహారాలు ఇప్పుడు సాయి మాధవ్ చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన ఆ పనుల్లో బిజీ బిజీగా గడుపుతూ ఉన్న నేపథ్యంలో సినిమాకి పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేక ఆయనే స్వయంగా సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు. ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
“విశ్వంభర” సినిమా విషయానికి వస్తే…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా “విశ్వంభర” సినిమా తెరకెక్కుతోంది. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా… మీనాక్షి చౌదరి, సురభి, ఆశ్రితా వేముగంటి వంటి వాళ్లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సినిమా ఒక సోషల్ ఫాంటసీ సబ్జెక్టుగా తెరపైకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమాలో త్రిష పాత్ర కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. ఇందులో ఆమె డ్యూయల్ రోల్ చేస్తోందని, ఒక సాధారణ అమ్మాయి, దేవతగా త్రిష కనిపించబోతోందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా నుంచి సాయి మాధవ్ బుర్ర తప్పుకోవడంతో మరే రైటర్ రంగంలోకి దిగబోతున్నారు? అనే విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.