ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అంటున్నారు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్. ఇప్పటిదాకా ఉన్న పాన్ ఇండియా ఫీవర్ ని పక్కన పెట్టేసి పాన్ వరల్డ్ ట్రెండ్ ను సెట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ టాలీవుడ్ సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్రన్ ఆడియన్స్ కి తెలుగు సినిమాల రుచి ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
పాన్ ఇండియా ట్రెండ్…
పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిందే టాలీవుడ్. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన టాలెంట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను భారతీయ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. “బాహుబలి”తో అన్ని భాషల్లోనూ ఇండస్ట్రీ హిట్ కొట్టి పాన్ ఇండియా రేంజ్ కు టాలీవుడ్ పరిధిని విస్తరించారు. సినిమాకు భాషా పరిధులు లేవని ఆయన ప్రూవ్ చేశారు. రాజమౌళి కొట్టిన దెబ్బకు బాలీవుడ్ సైతం మూగబోయింది. కంటెంట్ ఉన్న కథలతో, దానికి తగ్గ కటౌట్ ఉన్న హీరోలతో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే హిందీ హీరోల, మేకర్స్ పొగరును పూర్తిగా తొక్కి పడేశారు తెలుగు ఫిల్మ్ మేకర్స్. రాజమౌళి పరిచిన ఈ బాట కారణంగా టాలీవుడ్ సినిమాల స్పాన్ పెరిగింది. హీరోలు, దర్శకులు, నిర్మాతల ఆలోచనా విధానంలో రాజమౌళి వల్లనే మార్పు వచ్చింది. ఫలితంగా వరసగా పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతానికి అయితే రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ టాప్ పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా ఫీవర్ ను పక్కన పెట్టేసి పాన్ వరల్డ్ పై కాన్సెంట్రేట్ టాలీవుడ్ మేకర్స్.
ఈ ముగ్గురు హీరోల టార్గెట్ పాన్ వరల్డే…
ప్రస్తుతం టాలీవుడ్ లో ముగ్గురు బడా హీరోలు పాన్ వరల్డ్ పై దృష్టి పెట్టారు. “కల్కి” సినిమాతో ప్రభాస్, “పుష్ప 2” సినిమాతో అల్లు అర్జున్, “SSMB 29″తో మహేష్ బాబు పాన్ ఇండియా పరిధిని దాటి ఎదగడానికి ప్లాన్స్ వేస్తున్నారు. ఇక వీళ్లతో పాటే దర్శకులు రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు టాలీవుడ్ టాలెంట్ ను పరిచయం చేయడానికి తహతలాడుతున్నారు. కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలని గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీళ్ళ ప్లాన్స్ చూస్తుంటే హాలీవుడ్ స్థాయికి టాలీవుడ్ ను తీసుకెళ్లి నిలబెట్టాలని శపథం చేసినట్టుగా ఉన్నారు అన్పిస్తోంది. ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని, తెలుగు సినిమా కీర్తి కిరీటాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసే తరుణం ఎప్పుడు వస్తుందా అని తెలుగు సినీ ప్రియులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో టాలీవుడ్ పేరు స్వర్ణాక్షరాలతో లిఖించాలని ఎడతెగని కృషి చేస్తున్న ఈ ముగ్గురు దర్శకులు, హీరోల ప్రయత్నం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ప్రయత్నాలు
ఇటీవల అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో తన మూవీ “పుష్ప” స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని తను అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి ఉపయోగించుకుంటున్నాడు అల్లు అర్జున్. అక్కడ ఏకంగా పలువురు ఇంటర్నేషనల్ మేకర్స్, బయ్యర్స్ తో అల్లు అర్జున్ ముచ్చటించారు. “పుష్ప 2″ను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఈ ఫిలిం ఫెస్టివల్ ఆయనకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాగా “పుష్ప 2” ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. “కల్కి” మే 9న రిలీజ్ కావలసి ఉండగా, పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇక “SSMB 29” ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉందన్న విషయం తెలిసిందే.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.