Tillu Cube Update : ఒక్కో పార్ట్ కు ఒక్కో దర్శకుడు… టిల్లు క్యూబ్ కోసం మ్యాడ్ డైరెక్టర్?

Tillu Cube Update : రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ దాదాపు 100 కోట్లను కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్ టిల్లు యూనివర్స్ లో మూడో భాగం కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో ఇప్పటి నుంచే ఆ మూవీ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టిల్లు క్యూబ్ కోసం కొత్త డైరెక్టర్ రంగంలోకి దిగబోతున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. మరి టిల్లు క్యూబ్ ను తెరకెక్కించబోయే డైరెక్టర్ ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

టిల్లు క్యూబ్ కోసం మ్యాడ్ డైరెక్టర్ ?

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ మార్చ్ 29న రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. మల్లిక్ రాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఏప్రిల్ 26 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే టిల్లు క్యూబ్ గురించి పలు ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పార్ట్ 3 టిల్లు క్యూబ్ కోసం మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రంగంలోకి దిగబోతున్నారని సమాచారం.

జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ కామెడీ సినిమాల రచనలో భాగమైన కళ్యాణ్ శంకర్ మ్యాడ్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ మ్యాడ్ 2 మూవీని రూపొందించడంలో బిజీగా ఉన్నారు. అలాగే మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లలో రచయితగా కళ్యాణ్ శంకర్ భాగం కాబోతున్నారు. ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ టిల్లు స్క్వేర్ రచనలో కూడా కళ్యాణ్ శంకర్ హస్తముంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రాంచీలో రాబోతున్న మూడవ పార్ట్ లో ఆయన డైరెక్ట్ గా దర్శకుడిగా రంగంలోకి దిగబోతున్నాడని సమాచారం.

- Advertisement -

టిల్లు క్యూబ్ అప్డేట్

టిల్లు క్యూబ్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే హీరో సిద్దు జొన్నలగడ్డ స్టార్ట్ చేశాడు. తాజా సమాచారం ప్రకారం సిద్దు ఈ మూవీని కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పార్ట్ 3లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా కంటిన్యూ కానున్నాడు. కొత్త హీరోయిన్ తో త్వరలోనే షూటింగ్ ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సిందే.

ఒక్కో పార్ట్ కు ఒక్కో డైరెక్టర్…

డిజె టిల్లు మూవీ ఏ ముహూర్తాన వచ్చిందో గాని సిద్దు జొన్నలగడ్డకు మంచి ఫేమ్ తీసుకొచ్చింది. అలాగే నిర్మాతలకు ఈ ఫ్రాంచైజీ కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే వీళ్ళ స్ట్రాటజీ మాత్రం కొత్తగా ఉంది. సాధారణంగా ఏదైనా సినిమా హిట్ అయితే అదే డైరెక్టర్, దాదాపుగా ఆ సినిమాలో నటించిన నటీనటులతోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా ముందుకు తీసుకెళ్తారు. కానీ టిల్లు విషయంలో ఇది పూర్తిగా ఆపోజిట్ గా జరుగుతోంది. ఈ సినిమాలో ఒక్క పార్ట్ కు ఒక్కో డైరెక్టర్ ఎంట్రీ ఇస్తున్నారు.

డీజే తెలుగు మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. అలాగే ఫస్ట్ పార్ట్ లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. ఇక రెండో పార్ట్ టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించగా, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. టిల్లు మూడవ పార్ట్ టిల్లు క్యూబ్ కు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ను రంగంలోకి దించాలని సిద్దు ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు