Jai Hanuman : “జై హనుమాన్”ను పక్కన పెట్టి మరో ప్రాజెక్టు చేస్తున్న ప్రశాంత్ వర్మ… కారణం ఇదే

ఈ ఏడాది హనుమాన్ మూవీతో మూవీ లవర్స్ కు మంచి కిక్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ. పండగ టైంకి హనుమాన్ కరెక్ట్ గా థియేటర్లలోకి దిగి, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ 300 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైం అత్యధిక వసూళ్లు రాబట్టిన సంక్రాంతి మూవీగా నిలిచింది. అయితే థియేటర్లలోనే చివర్లో “జై హనుమాన్” అంటూ సీక్వెల్ ఉంటుందనే విషయాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడేమో ప్రశాంత్ వర్మ ఆ సీక్వెల్ ను పక్కన పడేసి, “ఆక్టోపస్” అనే మరో ఉమెన్ సెంట్రిక్ మూవీపై కాన్సన్ట్రేట్ చేసాడు. మరి ఇంతకీ ప్రశాంత్ వర్మ “జై హనుమాన్” మూవీని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? అంటే…

“జై హనుమాన్” హోల్డ్ లో పడడానికి ఇదే కారణమా? “జై హనుమాన్” మూవీకి రోజుకొక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే డిజిటల్ రిలీజ్ విషయంలో హనుమాన్ టీం ఆలస్యం చేస్తూ వచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత ఓటీటీలోకి వచ్చి నెగటివ్ టాక్ ను ఎదుర్కొంది. ఇప్పుడేమో జై హనుమాన్ మూవీ లేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. లేట్ అవుతుంది అనడం కన్నా ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టేసారు అనడం కరెక్టేమో. ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఆక్టోపస్ అనే కొత్త మూవీని అనౌన్స్ చేయడంతో జై హనుమాన్ హోల్డ్ లో పడిందన్న విషయం కన్ఫామ్ అయ్యింది. అయితే ఈ మోస్ట్ అవైటింగ్ మూవీని ప్రశాంత్ వర్మ పక్కన పెట్టడానికి కారణం స్టార్ హీరోలు అని తెలుస్తోంది. సీక్వెల్ లో హనుమాన్ గా ఒక బడా స్టార్ ను తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు ప్రశాంత్ వర్మ. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా రేస్ లో పరిగెడుతున్నారు స్టార్ హీరోలంతా. హనుమాన్ కు తగ్గ కటౌట్ ఉన్న హీరోలు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్కరు కూడా హనుమాన్ రోల్ ప్లే చేసేంత ఖాళీగా లేకపోవడంతో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీపై కాన్సన్ట్రేట్ చేసినట్టు తెలుస్తోంది. స్టార్ హీరోలు ఫ్రీ అయ్యేలోపు ఆక్టోపస్ మూవీని పూర్తి చేయొచ్చు అని ఆయన భావించారట. ఆక్టోపస్ మూవీ తర్వాత మళ్లీ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పై ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది.

“జై హనుమాన్”కు రోజుకో కష్టం…

- Advertisement -

హనుమాన్ మూవీని థియేటర్లలో దాదాపు నెల రోజులకు పైగా ఆడేలా చేసిన ప్రేక్షకులు జై హనుమాన్ మూవీ గురించి అప్పటినుంచి క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. మేకర్స్ జై హనుమాన్ మూవీని 2025లో రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో సినీ ప్రియులంతా ముఖ్యంగా హనుమాన్ లవర్స్ హైలో ఉన్నారు. అది చాలదన్నట్టు అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని డైరెక్టర్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి అంచనాలను మరింతగా పెంచేశాడు. కానీ నెమ్మది నెమ్మదిగా ఈ సినిమా ఆలస్యం తప్పదు అనిపించేలా సిగ్నల్స్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్. ముందుగా తేజ సజ్జ స్టార్ట్ చేశాడు. హనుమాన్ మూవీ రిలీజ్ కావడానికి చాలా సమయం పడుతుందని, అంతలోపు మరికొన్ని సినిమాలు చేస్తానంటూ ఓ మీడియా ఇంటరాక్షన్ లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి అనే వార్తలు బయటపడ్డాయి. వాటిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ కొత్త సినిమా “ఆక్టోపస్”ను మొదలుపెట్టడం కొత్త అనుమానాలకు తెరతీసింది. ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించబోతున్న విషయం తెలిసిందే.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు