Mangalavaaram: ఈ మూవీ వెనకున్న రియల్ స్టోరీ ఏంటో తెలుసా?

Mangalavaaram: గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజపుత్ రీసెంట్ మూవీ “మంగళవారం”. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్లలో నవంబర్ 17న విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రివ్యూలు పాజిటివ్ గానే వచ్చినప్పటికీ ఈ మూవీ విడుదలైన టైంలోనే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఉండడంతో ప్రేక్షకులు ఎక్కువగా మూవీపై ఫోకస్ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే “మంగళవారం” మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. “మంగళవారం” మూవీ అందరూ అనుకుంటున్నట్టుగా కల్పిత కథ కాదట. ఇదొక రియల్ స్టోరీ అనే విషయం తాజాగా రివీల్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ అజయ్ భూపతే చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మంగళవారం స్టోరీ గురించి చెప్పాడు. మరి ఆ రియల్ స్టోరీ ఇక్కడ చూద్దాం…

ప్రస్తుతం “మంగళవారం” మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సోషల్ మీడియాలో మిక్సిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక “మంగళవారం” రీల్ స్టోరీ విషయానికి వస్తే… మహాలక్ష్మి పురం అనే గ్రామంలో ప్రతి మంగళవారం ఎవరో ఒకరు చచ్చిపోతూ ఉంటారు. అయితే వాళ్లు చావడానికి ముందే అక్రమ సంబంధాలు ఉన్న వ్యక్తుల పేర్లు ఊర్లోని గోడ మీద రాసి ఉంటాయి. గోడ మీద ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్లే ఆ తెల్లారే చనిపోతూ ఉంటారు.

ఇంతకీ ఆ గోడల మీద పేర్లు రాస్తుంది ఎవరు? మంగళవారం మాత్రమే ఎందుకు చనిపోతున్నారు? ఈ చావుల వెనకున్నది ఎవరు? ఆ చావులకు హీరోయిన్ కు ఉన్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికర అంశాలను మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ వెనక ఉన్న రియల్ స్టోరీ విషయానికి వస్తే… సినిమాలో హీరోయిన్ శైలు లాంటి అమ్మాయి నిజంగానే ఉందట. ఆ అమ్మాయి డాక్టర్ అని సమాచారం. ఇక ఈ అమ్మాయికి సినిమాలో హీరోయిన్ కి ఉన్న జబ్బే నిజ జీవితంలోనూ ఉందట.

- Advertisement -

ఈ డాక్టర్ లైఫ్ లో జరిగిన సన్నివేశాలతోనే డైరెక్టర్ అజయ్ భూపతి “మంగళవారం” మూవీని రూపొందించారు. ఈ డాక్టర్ కు తనకు అలాంటి వ్యాధి ఉందన్న విషయం 10 నెలల అనంతరం తెలిసిందట. ఆమె ఒంటరిగా ఉండడం వల్లే ఆ జబ్బు బారిన పడిందని సమాచారం. ప్రస్తుతం “మంగళవారం” మూవీ డిస్నీలో స్ట్రీమింగ్ అవుతున్న వేళ ఈ విషయం బయటకు రావడం ఆసక్తికరంగా మారింది.

ఇక “మంగళవారం” మూవీ ఫ్యామిలీ అండ్ కామెడీ, లవ్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ వంటి అంశాలతో తెరకెక్కింది. డిసెంబర్ 26 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ డిస్నీలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబో తమ మొదటి చిత్రం “ఆర్ఎక్స్ 100” మూవీ తర్వాత “మంగళవారం” మూవీతోనే హిట్ అందుకున్నారు. ఈ మూవీ ముందు వరకు వాళ్ళు వేర్వేరుగా చేసిన సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు