Keerthi Suresh : కీర్తి సురేష్ ను అందుకే ఎంపిక చేసుకున్నారట..!

మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అయినా బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. 5 రోజుల్లో ఈ మూవీ సుమారు రూ.100 కోట్లకి పైగా షేర్ ను కలెక్ట్ చేసింది. మరో వారం రోజులు నిలబడితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు. కళావతి అనే పాత్రలో ఆమె నటించింది. నిజానికి ఈమె ‘సర్కారు వారి పాట’ లో హీరోయిన్ గా ఎంపికైంది అని తెలిసినప్పటి నుండీ మహేష్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అందుకు కారణం ఈమె నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అవ్వడం వల్లే..!

అయినప్పటికీ మహేష్ అభిమానులకి వ్యతిరేకంగా వెళ్లి.. ఆమెను ఎంపిక చేసుకోవడం పట్ల చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర హీరోని మోసం చేసేదిగా ఉంటుంది. అలాంటి పాత్రకి గ్లామర్ రోల్స్ చేసే అమ్మాయిలని పెడితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు. అయితే కీర్తి సురేష్ ‘మహానటి’ తో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కాబట్టి.. అలాంటి అమ్మాయిని పెడితే మహేష్ బాబు వంటి స్టార్ హీరోని డామినేట్ చేసినా బ్యాలన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు