Surekha Vani : ఈ మగాళ్ల బుద్దే ఇంత… సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి సురేఖ వాణి ఈ మగాళ్ళ బుద్ధి ఇంత అంటూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె అలా కామెంట్స్ చేయడానికి కారణం ఏమిటి అంటే?

సీనియర్ నటిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. టాలీవుడ్ హీరోలకు అక్క, పిన్ని, అత్త వంటి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో కనిపించడం చాలా వరకు తగ్గించిన సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. వరుసగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా తన కుమార్తెతో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ తల్లి కూతుర్లు ఇద్దరికీ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ కలిసి చేసే గ్లామర్ షోకు కుర్రాళ్ళు అల్లాడిపోతూ ఉంటారు.

తాజాగా సురేఖ వాణి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. అందులో “మగాళ్ళంతా సేమ్… మనల్ని రీచ్ అయ్యేంతవరకు ఒకలా ఉంటారు, రీచ్ అయ్యాక అందరూ ఒకేలా ఉంటారు” అంటూ డబ్ స్మాష్ చేసింది. ఈ మగవాళ్ళ బుద్ధి ఇంతే అనే విధంగా సురేఖ వాణి షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓన్లీ వన్స్ ఫసక్ అంటూ ఆ వీడియోకు ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు. కాగా సురేఖ వాణి నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల యువతిలా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఆమె తన భర్త సురేష్ తేజ చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం తన కుమార్తెతో ఈ బ్యూటీ కలిసి ఉంటుంది. ఇటీవల సురేఖ వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు రాగా వాటిని కొట్టి పారేసింది.

- Advertisement -

కాగా సురేఖ వాణి సినిమాలను దూరం పెడుతుందా/ లేకపోతే ఆమెకు టాలీవుడ్ మేకర్స్ ఆఫర్స్ ఇవ్వట్లేదా? అనే విషయం తెలియదు. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కన్పిస్తూ ఉంటుంది. ట్రోలింగ్ ను ఏమాత్రం పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగా బతుకుతోంది. ప్రస్తుతం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో సురేఖ వాణి కూడా భాగమైంది. మరి ఈ సినిమా తర్వాత అయినా సురేఖ వాణికి టాలీవుడ్ లో అవకాశాలు మరోసారి పెరుగుతాయేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు