Surekha Vani: ఆ పని చేసి… అమెరికాకు పారిపోయిన టాలీవుడ్ నటి ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉంటారు. కొంతమంది హీరోయిన్లు ఉంటే మరికొంతమంది ఆంటీ అవతారాలలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు. ఒకప్పుడు యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన సురేఖ వాణి… ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటిగా మారిపోయారు. ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ… ప్రస్తుతం ఈ హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా నటిస్తోంది.

సురేఖ వాణి కెరీర్

మొదట్లో యాంకర్ గా పని చేసిన సురేఖ వాణి 2005 సంవత్సరంలో ఇండస్ట్రీలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది సురేఖ వాణి. ఆ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి ఆఫర్లు వచ్చాయి. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోల సరసన దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోల సినిమాలలో నటించింది సురేఖ వాణి.

- Advertisement -

భర్త మరణం తర్వాత…!

అయితే సజావుగా సాగుతున్న నటి సురేఖ వాణి జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సురేఖ వాణి భర్త సురేష్ తేజ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణంతో తీవ్ర డిప్రెషన్ కు వెళ్ళింది సురేఖ వాణి. అప్పటికే సుప్రీత చిన్నపిల్ల. ఇక ఆమెను పెంచి పోషించేందుకు చాలా కష్టపడింది సురేఖ వాణి. ఇక భర్త చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబంలో చాలామంది ఫోర్స్ చేశారట. కానీ సురేఖ వాణి అస్సలు రెండో పెళ్లి చేసుకోలేదు.

వచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగింది. కానీ కొంతమంది ఆమెకు ఎఫైర్లు ఉన్నాయని లేదా రెండవ పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేశారు. కానీ ఏమాత్రం తగ్గకుండా… తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగింది. అలాగే తన కూతురు సుప్రీతాను హీరోయిన్ చేసే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో తన కూతురితో పాటు సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది.

అప్పుడప్పుడు హాట్ అందాలను ఆరబోస్తూ నిత్యం యూత్ ను టెంప్ట్ చేస్తోంది సురేఖ వాణి. సురేఖ వాణి తో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది. బర్త్డే పార్టీలు ఫారన్ ట్రిప్పులు అంటూ తల్లి కూతుర్లు ఇద్దరు తెగ తిరిగేస్తారు.

అమెరికాకు జంప్ ?

అయితే టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. అయితే డ్రగ్స్ ముఠాతో సురేఖ వాణి ఫోటోలు దిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా విచారణ చేస్తోంది. ఈ తరుణంలోనే సురేఖ వాణి అమెరికాకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని భావించిన సురేఖ వాణి… అక్కడికి వెళ్లారట. హైదరాబాద్ లో ఉంటే తరచూ విచారణ పేరుతో వేధించే ఛాన్స్ ఉందని… అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు కొంతమంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు