SSMB28 : మళ్ళీ రిపీట్ చేయనున్న గురూజీ

త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల అల్లికలో తనను మించినవారు లేరు. అందుకే ఆయనను మాటల మాంత్రికుడు అని పిలుస్తుంటారు. ఆయన డైలాగ్స్ కోసమే హీరోలు సినిమాలు చేయాలని చూస్తుంటారు. ఆయన సినిమాలు ప్లాప్ అయినా, డైలాగ్స్ కు ఎంత పాపులారిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి బెస్ట్ ఉదాహారణ ’’ఖలేజా’’. ప్రిన్స్ మహేష్ బాబు-అనుష్క హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఈ మూవీ, అప్పట్లో ఆకట్టుకోలేక పోయింది. కానీ ఇప్పుడు టీవీలో వస్తే మాత్రం చూడలేకుండా ఉండలేరు.

ఖలేజా కన్న ముందే మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ’’అతడు’’ సినిమా చేశాడు. మహేష్ కెరీర్ లో ’’అతడు’’ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ కు రెడీ అవుతున్నారు. SSMB28 వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారు. టాలీవుడ్ లో క్రేజీ కాంబోగా పేరు తెచ్చుకున్న వీరు, సినిమా చేస్తున్నరంటే భారీ అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ప్రస్తుతం SSMB28 గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు సెకండ్ హీరోని ఎంపిక చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడట. ముందుగా నెగెటివ్ షెడ్స్ ఉండి, తర్వాత పాజిటివ్ గా మారే పాత్ర కోసం నితిన్ లేదా, శర్వనంద్ లలో ఒక్కరి ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” సుశాంత్ పాత్ర ను పోలి ఉంటుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇది వాస్తవమో తెలియాలంటే, మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు