#SHARWA35: గందరగోళంలో శర్వానంద్ సినిమా

ఇటీవలనే పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడైన శర్వానంద్ పర్సనల్ లైఫ్ హ్యాపీ గా ఉన్న కూడా ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం ఆయనకు మనశ్శాంతి కరువైంది. ఇలా పెళ్లి అయ్యి అవ్వగానే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా, హనీమూన్ ప్లాన్స్ ను సైతం వాయిదా వేసుకొని ఆయన లేటెస్ట్ సినిమా కంప్లిట్ చేసే పనిలో పడ్డాడు. కానీ ఈ సినిమా మాత్రం శర్వానంద్ కు చుక్కలు చూపిస్తుందని టాక్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.శర్వానంద్ కెరీర్ లోనే సూపర్ హిట్టైన రన్ రాజా రన్ సినిమా తరహాలో సినిమా ఉంటుందని శర్వానంద్ ను సినిమా ఒప్పించి సెట్స్ పైకి తీసుకెళ్లిన శ్రీ రామ్ ఆదిత్య సినిమాను తనకు చెప్పిన విధంగా తీయట్లేదని హీరోకు , డైరెక్టర్ కు ఆ మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

కాగా ఇటీవలనే ఈ విభేదాలన్నీ సమసిపోయి, తిరిగి మళ్ళీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు. అయితే 30 కోట్ల బడ్జెట్ సినిమా తీస్తానని చెప్పిన శ్రీ రామ్ ఆదిత్య ఇప్పటి వరకు 40 కోట్ల వరకు ఖర్చు అయిన కూడా సినిమా మాత్రం కంప్లిట్ చేయలేదట. ఇంకా సగానికి సగం సినిమా పెండింగ్ లో ఉందట. ఇక ఈ సగం సినిమా షూట్ చేయాలంటే తక్కువలో తక్కువ 10 కోట్లయిన అవుతాయంట. సరే అంత ఖర్చుపెట్టి తీసిన కూడా సినిమా ఆ మేరకు ఈ సినిమా కలెక్ట్ చేయడం కష్టమే అని అనుకుంటున్నారట దాంతో మూవీ యూనిట్ కు ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు