Alia Bhat : భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన భన్సాలీ.. మరో పద్మావత్ అవుతుందా?

బాలీవుడ్ లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసే అతి కొద్ది మంది దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలి ఒకరు. బాలీవుడ్ లో కళాత్మకంగా సినిమాలు తీసే ఈ డైరెక్టర్ తన సినిమాల్లో భారతీయ కళల్ని గ్రాండియర్ గా చూపిస్తుంటాడు. ఒక రామ్ లీల, బాజీరావు మస్తానీ, ఒక పద్మావత్ ఇలా ఎన్నో సినిమాలతో తన దర్శకత్వ ప్రతిభతో ఆడియన్స్ ని మెప్పించాడు. ముఖ్యంగా హీరోయిన్ల పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే ఈ దర్శకుడు రెండేళ్ల కిందట గంగూబాయి కతియవాడి సినిమాతో హిట్ కొట్టాడు.

తాజాగా ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ మేల్ లీడ్స్ గా, అలియా భట్ ఫీమేల్ లీడ్ గా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ లవ్ స్టోరీ అని డైరెక్టర్ అనౌన్స్ చేశారు. అంటే ఒక పద్మావతి రేంజ్ సినిమాని మళ్ళీ దింపుతున్నాడని అనుకోవచ్చు. ఇక ఈ ముగ్గురు స్టార్స్ మినహా ఇతర కాస్ట్ & క్రూ వివరాలు తెలియాల్సి ఉంది. అలా కాకుండా రామ్ లీలా లాగా ఇప్పటి జెనరేషన్ కి మ్యాచ్ అయ్యేలా కమెర్షియల్ టచ్ కూడా ఇవ్వవచ్చు.

ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరోయిన్లు అయితే బహుశా విక్కీ కౌశల్ విలన్ గా నటించే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాను 2025 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నామని కూడా అనౌన్స్ చేసేసాడు. ఈ లోపు ప్రస్తుతం తాను డైరెక్ట్ చేస్తున్న హీరామండి సినిమాను రిలీజ్ చేసేయొచ్చు. అయితే సంజయ్ లీలా భన్సాలీ తీసే ఈ భారీ లవ్ స్టోరీ ప్రాజెక్ట్ ఏదైనా చారిత్రాత్మక కథని స్ఫూర్తిగా తీసుకుని రాస్తే మాత్రం ముందే అన్ని క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ అని, లేదంటే అప్పుడు పద్మావత్ కి వచ్చిన ఇబ్బందులే తలెత్తుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు