డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రభాస్ తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీని పక్కన పెట్టేసాడట. ప్రస్తుతం ఈ దర్శకుడు మరో సినిమా చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాడట. మరి సందీప్ “స్పిరిట్” సినిమాను పక్కన పెట్టడానికి కారణం ఏంటి? అంటే…
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “యానిమల్” బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోస్తున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ మూవీ ప్రస్తుతం 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. ఇక ఈ మూవీ పూర్తయింది కాబట్టి ఆయన ప్రభాస్ మూవీ “స్పిరిట్” పై కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందని డార్లింగ్ ఫాన్స్ అంతా భావించారు. “యానిమల్” మూవీ ప్రమోషన్లలో సందీప్ రెడ్డి వంగా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం సందీప్ ప్లాన్ చేంజ్ అయిందట. “స్పిరిట్” మూవీ కంటే ముందే ఆయన యానిమల్ మూవీ సీక్వెల్ “యానిమల్ పార్క్” తీయాలని ప్లాన్ చేస్తున్నాడట.
నిజానికి స్పిరిట్ మూవీ ని అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది. “యానిమల్” మూవీ రిలీజ్ అయ్యాక “స్పిరిట్” ను స్టార్ట్ చేయాలన్నది అసలు ప్లాన్. కానీ “యానిమల్” మూవీ అనూహ్యమైన విజయం సాధించడంతో మేకర్స్ ప్లాన్స్ తారుమారయ్యాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చిత్ర బృందం “యానిమల్” సీక్వెల్ కు సంబంధించిన పనులను స్టార్ట్ చేసింది. సందీప్ మనసు మార్చుకోవడానికి ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. “యానిమల్” సీక్వెల్ కంటే ముందే “స్పిరిట్” మూవీని చేస్తే ఆడియన్స్ చాలాకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పటివరకు “యానిమల్” మూవీని ప్రేక్షకులు మరిచిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రేక్షకులను ఎక్కువకాలం వెయిట్ చేయించకుండా వాళ్లు ఆ మేనియాలో ఉన్నప్పుడే సీక్వెల్ ను కూడా రిలీజ్ చేయడం మంచిదని భావించారు.
మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ సైతం వరుసగా భారీ సినిమాలు చేస్తూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అది చాలదన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఈ హీరో కాల్షిట్లు మొత్తం వరుస సినిమాలతో ఫుల్ గా ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం “కల్కి” మూవీ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో పాటు మారుతి దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. “సలార్” రిలీజ్ అయినప్పటికీ ప్రభాస్ బిజీగానే ఉంటాడు. కాబట్టి ఆ టైంలో “యానిమల్” సీక్వెల్ ను పూర్తి చేయొచ్చని సందీప్ భావించాడు. ఇక ఈ రెండు సినిమాలకు నిర్మాతలు టి సిరీస్ వారే కావడం వీళ్ళకి కలిసి వచ్చింది. అటు యానిమల్స్ సీక్వెల్ పూర్తయ్యాక సందీప్, ఇటు చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక “స్పిరిట్” పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మారుతి- ప్రభాస్ సినిమాలో తమిళ కమెడియన్ యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. ప్రభాస్, సందీప్ “స్పిరిట్” సినిమాను పక్కనపెట్టి, తమ ఇతర సినిమాలపై కాన్సన్ట్రేట్ చేశారు అనడానికి ఇదే సాక్ష్యం.
Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.