Samantha : సోషల్ ‘డిస్టెన్స్’ ?

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ సమంత, సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటి కప్పుడు తన అప్డేట్స్‌ ను సోషల్‌ మీడియా వేదికగా తెలియపరిస్తూ, ఫుల్‌ జోష్‌ లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ట్రోలింగ్‌, నెగిటివ్‌ కామెంట్స్‌ చేసే వారికి కూడా దిమ్మ తిరిగే కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది సమంత. అలాగే తన అభిమానులకు ఎప్పుడూ టచ్‌ లో ఉంటుంది. ఇన్‌ స్టా గ్రామ్‌ వేదికగా మోటివేషనల్‌ కోట్స్‌ తో పాటు తన సినీ అప్డేట్స్‌ ఇచ్చే సమంత, గత కొన్ని రోజులుగా అస్సలు అప్డేట్స్‌ ఇవ్వడమే లేదు. ఒక్క పోస్ట్‌ కూడా పెట్టనే లేదు.

ఈ నేపథ్యంలోనే సమంత సంచలన నిర్ణయం తీసుకుందా అనే ప్రశ్న అందరిలోనూ వస్తోంది. సోషల్‌ మీడియాకు ఇక నుంచి దూరంగా ఉండాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనికి సమంత స్వయంగా చెప్పకపోయినా, ఆమె సిబ్బంది మాత్రం ఇదే విషయాన్ని తేల్చారట. దీనికి రెండు కారణాలు కూడా ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి ఈ మధ్య సమంత సోషల్‌ మీడియా అకౌంట్‌ హ్యాక్‌ అయింది.

అప్పటి నుండి సమంత కూడా అలర్ట్‌ అయ్యారని తెలుస్తోంది. అసలు సోషల్‌ మీడియాకు కాస్త దూరంగా ఉంటేనే బాగుంటుందని నిర్ణయం తీసుకుందంట సామ్‌. ఇక రెండో కారణం, సమంత బిజీ షెడ్యూల్‌. ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం కంటే, తన కెరీర్‌ పై ఫోకస్‌ చేయడమే బెటర్‌ అనుకున్నారని టాక్‌. మొత్తానికి సమంత సోషల్ మీడియాకు డిస్టెన్స్ పాటిస్తుందని తెలిసిపోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు