Sai Rajesh: బేబీ కాంబినేషన్ రిపీట్ అవుతుందా..?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కలర్ ఫోటో సినిమాకి నిర్మాతగా వ్యవహరించి నేషనల్ అవార్డు అందుకున్న సాయిరాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించి మరో సక్సెస్ అందుకున్నాడు. కెరీర్ ఆరంభం నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ నుండి సిల్వర్ స్క్రీన్ మీద మెరిసిన వైష్ణవి చైతన్య లకు మంచి బ్రేక్ ఇచ్చింది బేబీ సినిమా. టాక్సీవాలా ద్వారా ప్రొడ్యూసర్ గా మారిన ఎస్ కే ఎన్ ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దర్శక నిర్మాతలు ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు.

సాయి రాజేష్ ఎస్ కే ఎన్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని స్పష్టం చేసాడు. ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ బేబీ సినిమాకు తాను కూడా సహా నిర్మాతగా ఉండాలని బావించాడని కానీ, కొన్ని కారణాల వల్ల ఎస్ కే ఎన్ ఒక్కడే నిర్మాతగా వ్యవహరించాడని చెప్పాడు. డైరెక్టర్ గా కంటే ప్రొడ్యూసర్ గా ఉండటమే తనకు ఇష్టమని చెప్పాడు.

తమ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన సాయిరాజేష్ ఇకపై ఒకటి రెండు సినిమాలకు మాత్రమే డైరెక్ట్ చేసి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతానని చెప్పాడు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో రానున్న నెక్స్ట్ సినిమా కూడా లవ్ స్టోరీనా లేక వేరే జానర్లో ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. లో బడ్జెట్ సినిమాలకు లవ్ స్టోరీ అయితేనే సేఫ్ కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా లవ్ స్టోరీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బేబీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న వీళ్ల కాంబినేషన్లో నెక్స్ట్ ఏ సినిమా వస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు