Sai Pallavi : ‘విరాట పర్వం’ లో సాయి పల్లవి పాత్ర చనిపోతుందా?

రానా, సాయి పల్లవి హీరో, హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు సృష్టించింది. ట్రైలర్స్ డైలాగ్స్, విజువల్స్ హైలెట్ గా నిలిచాయి.

అయితే ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం, ఈ చిత్రంలో హీరో రానా పాత్ర కంటే కూడా సాయి పల్లవి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీకి ట్రాజెడీ ఎండింగ్ ఉంటుందని కూడా వినికిడి. సినిమా క్లైమాక్స్ లో సాయి పల్లవి పాత్ర చనిపోతుందట. ఆమె కోసం రానా పాత్ర కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతుందని తెలుస్తుంది. అది నిజమే అయితే ‘నేనే రాజు నేనే మంత్రి’ క్లైమాక్స్ లా అయిపోతుంది కదా..! ఆది నిజమో కాదో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు