BRO: సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది సినిమా క్యాన్సిల్ – అదే కారణమా..?

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సంపత్ నంది డైరెక్షన్లో ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తేజ్. బ్రో రిలీజ్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయనున్నాడన్న వార్తలొచ్చాయి. అయితే, ఫిజికల్ ఫిట్నెస్ కోసం తేజ్ ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకోనున్నాడంటూ ఈ మధ్య వార్తలొచ్చిన నేపథ్యంలో సంపత్ నందితో కమిట్ అయిన సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా ఆగిపోవటానికి మరో కారణం ఉందని టాక్ వినిపిస్తోంది. నిర్మాత బాపినీడుకి తేజ్ కి మధ్య డిఫరెన్సెస్ రావటంతోనే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని అంటున్నారు.
బాపినీడు కి మూడు సినిమాలు చేసేందుకు తేజ్ కమిట్ అయ్యాడు మొదట్లో. ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి కాగా, మూడో సినిమాను సంపత్ నంది డైరెక్షన్లో చేయడానికి ప్లాన్ చేసాడు. అయితే, విరూపాక్ష సినిమా రెమ్యునరేషన్ విషయంలో తేజ్ కి నిర్మాతకు మధ్య విబేధాలొచ్చాయని అందుకే నెక్స్ట్ సినిమా క్యాన్సిల్ చేసాడని అంటున్నారు.
బ్రో సినిమా రిలీజ్ తర్వాత ఆరు నెలల గ్యాప్ తీసుకోనున్న తేజ్ తిరిగి 2024 జనవరిలో సినిమా షూటింగ్స్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడట. తేజ్ మొదటిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన సినిమా కావటంతో రీమేక్ అయినప్పటికీ బ్రో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జులై 28న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా తేజ్ కి మరొక బ్లాక్ బస్టర్ అందిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు