మాస్ మహారాజ రవితేజ కొత్త టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేయటంలో ముందుంటాడు. డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ ఇలా చాలా మంది డైరెక్టర్స్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది రవితేజనే . అయితే, గత కొంత కాలంగా కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వటం మానేసాడు రవితేజ. ఆ మధ్య వచ్చిన టచ్ చేసి చూడు సినిమా డిజాస్టర్ అయిన తర్వాత కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం మరో కొత్త డైరెక్టర్ కి రవి ఛాన్స్ ఇచ్చాడంటూ వార్తలొస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ కమిట్ అయిన సినిమా ద్వారా వాసు అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని సమాచారం.
ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు, ఈగల్ సినిమాల్లో నటిస్తున్న రవితేజ గోపీచంద్ మలినేనితో మరో సినిమాను ఇటీవలే అనౌన్స్ చేసాడు. రవితేజ గత చిత్రం రావణాసురతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తుండటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా వైడ్ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.
ఇటీవలే రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాల గ్లిమ్ప్స్ లు ఆకట్టుకోవడంతో ఆ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ధమాకా, వాల్తేర్ వీరయ్య వంటి వరుస హిట్స్ అందుకున్న తర్వాత రావణాసుర లాంటి డిజాస్టర్ రవితేజ స్పీడ్ కి బ్రేకులేసిన నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. అక్టోబర్ 20న రిలీజ్ కి సిద్దమవుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజకి హిట్ ఇస్తుందా లేదా చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News