Tiger nageshwararao: బాత్రూంలోకి వెళ్లి మరీ ఏడ్చా.. రవితేజ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం అక్టోబర్ 20వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ పలు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది మూవీ యూనిట్.

అయితే ఈ సినిమాతో టాలీవుడ్ లోకి నుపూర్ సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈమె స్వయంగా నటి కృతి సనన్ సోదరి కావడం విశేషం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది నుపూర్ సనన్. తన లవ్ బ్రేకప్ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. మీరు ఎవరినైనా ప్రేమించారా..? అన్న ప్రశ్నకి సమాధానం ఇస్తూ.. ” కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని చాలా ఇష్టంగా గాఢంగా ప్రేమించాను.

కానీ అతను నన్ను మోసం చేస్తున్నాడని అర్థమయ్యేసరికి అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి, అతన్ని గుడ్డిగా నమ్మేసాను. నా లవ్ ఫెయిల్ అయ్యాక చాలా ఏడ్చాను. నా ప్రేమ విషయం ఇంట్లోవారికి తెలియదు. వారికి ఎక్కడ తెలుస్తుందోనని ఎంతో నరకం అనుభవించాను. అర్ధరాత్రి బాత్ రూమ్ లోకి వెళ్లి నా బాధ మొత్తం తీరిపోయే వరకు ఏడ్చేదానిని” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు