Raviteja: మళ్లీ వెళ్లి పరువుతీసుకోవడం అవసరమా రవన్న?

టాలీవుడ్ లో 2024 సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న “ఈగల్” కూడా ఒకటి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా, ఒక్కొక్కటిగా పాటలు కూడా రిలీజ్ చేస్తూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ .

అయితే తాజాగా “ఈగల్” సినిమా కి సంబంధించి ఓ సూపర్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే రవితేజ నటిస్తున్న ఈ ఈగల్ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే హిందీ వెర్షన్ టైటిల్ ని మాత్రం “సహదేవ్” గా నిర్ణయించారు. అయితే కొంతమంది ట్రేడ్ విమర్శకులు ఈ సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేయడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే రవితేజ ఆల్రెడీ ఈ ఇయర్ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసారు. పైగా రవితేజ దగ్గరుండి ముంబై కి వెళ్లి సినిమా కోసం పలు బాలీవుడ్ షోస్ లో ప్రమోషన్ కూడా చేసాడు. కానీ ఆ సినిమా రవన్న కి ఈ ఇయరే పెద్ద దెబ్బ పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఈగల్ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ కి వెళ్లి మళ్ళీ పరువు తీసుకోవడం అవసరమా అని ట్రెడ్ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

ఒకవేళ కంటెంట్ బాగుండి సినిమా సూపర్ హిట్ అయితే ఒకే, కానీ రెండో సారి రవితేజ కి దెబ్బపడితే ట్రోలింగ్ కి గురవడం ఖాయం అని ట్రేడ్ విమర్శకులు అంటున్నారు. అయినా ఈగల్ సినిమా కి సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే దీనీకే తక్కువ హైప్ ఉంది. మరి పండగ దగ్గరికొచ్చే సరికి ఈగల్ పై ప్రమోషన్లతో అంచనాలు ఎంత వరకు పెంచుతారో చూడాలి.

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు