టాలీవుడ్ బ్యూటీ ఏంజెల్ రాశిఖన్నా గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ లిస్టులో చేరింది. బెంగాల్ టైగర్, సుప్రీమ్, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే, జై లవకుశ లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి. ఇక గత కొంతకాలంగా రాశి ఖన్నా టైం అసలు బాగాలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి.
గోపిచంద్ తో పక్కా కమర్షియల్, నాగచైతన్య తో కలిసి చేసిన థాంక్యు సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశిఖన్నా కి పోటీ తప్పడం లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ రాశిఖన్నా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ట్రిపుల్ లో నటించిన సినిమా జై లవకుశ. ఈ సినిమాలో నివేతా థామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. జై లవకుశ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమాలోని “ట్రింగ్ ట్రింగ్” అనే సాంగ్ లో ఎన్టీఆర్ కంటే తక్కువ స్టెప్స్ రాశిఖన్నా కి ఇస్తున్నారని.. కొరియోగ్రాఫర్ ఎక్కువ స్టెప్స్ తారక్ కే ఎక్కువగా ఇస్తున్నారని తెగ ఏడ్చేసిందట రాశిఖన్నా. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు తారక్. కొరియోగ్రాఫర్ వద్దకు వెళ్లి ఆ అమ్మాయికి ఎక్కువగా స్టెప్స్ ఇవ్వండని చెప్పినప్పటికీ రాశిఖన్నా భయపడిందట. తారక్ కంటే ఎక్కువ స్టెప్స్ ఉంటే ఆయన అభిమానులు తనని ట్రోల్ చేస్తారని భయపడిందట. దీంతో ఏం చేయలేక తారక్ కామ్ అయిపోయారని.. ఇదే విషయాన్ని చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News