Ramayanam : రణబీర్, సాయి పల్లవిలకు షాకింగ్ రెమ్యూనరేషన్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ మూవీ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా లీక్స్ బయటకు వచ్చేసాయి. ఇక తాజాగా రామాయణం మూవీకి హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ సాయి పల్లవి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరి వీరిద్దరూ ఈ మూవీకి ఎంత పారితోషకం అందుకుంటున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

రణబీర్, సాయి పల్లవిల షాకింగ్ రెమ్యూనరేషన్

నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ రామాయణం. ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను ఇప్పటి వరకు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయినప్పటికీ హిందీ రామాయణం గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. అలా వచ్చే రూమర్స్ వల్ల సినిమాపై రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైపోగా, 11 కోట్ల భారీ ఖర్చుతో అయోధ్య సెట్ ను క్రియేట్ చేశారని సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ల రెమ్యూనరేషన్ ల గురించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో హీరోగా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ఏకంగా 250 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని, పారితోషికాన్ని ఆయన ఇన్స్టాల్మెంట్ రూపంలో అందుకోబోతున్నాడని సమాచారం. ఒక్కో ఇన్స్టాల్మెంట్ లో 75 కోట్ల చొప్పున రణబీర్ తన జేబులో వేసుకోబోతున్నాడని నడుస్తోంది.

మరోవైపు సాయి పల్లవికి కూడా ఈ సినిమా కోసం ఏకంగా 18 నుంచి 20 కోట్లు రెమ్యూనరేషన్ రూపంలో ముట్ట చెబుతున్నారట నిర్మాతలు. ఈ సినిమాలో రావణుడిగా కనిపించబోతున్న కన్నడ స్టార్ యష్ 150 కోట్ల పారితోషం తీసుకోబోతున్నారని బీ టౌన్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సినిమాకే కాకుండా నటీనటులకు కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మరోవైపు తాజాగా జరిగిన లీకుల కారణంగా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. లీకుల గురించి టీంను హెచ్చరించడమే కాకుండా సెట్లోకి ఫోన్లను అనుమంతించడం లేదని తెలుస్తోంది. అలాగే షూటింగ్ టైంలో ఎక్స్ట్రా సిబ్బంది లేకుండా చూసుకుంటున్నారట.

- Advertisement -

సాయి పల్లవి ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇది కాదు…

ప్రస్తుతం సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తోంది. నేచురల్ బ్యూటీగా అభిమానులను ఆకట్టుకుంటున్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది రామాయణం మూవీతో కాదు. అంతకంటే ముందే ఆమె మరో స్టార్ హీరో వారసుడితో రొమాన్స్ చేయబోతోంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న హిందీ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇదే సాయి పల్లవికి బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ కానుంది. ఆ మూవీతో పాటు నార్త్ లో రామాయణం చేస్తూనే, ఇటు సౌత్ లో అక్కినేని నాగచైతన్యతో తండేల్ అనే సినిమా చేస్తోంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు