Salaar: నాగ్ అశ్విన్ వార్నింగ్ ఇచ్చాడు , ప్రశాంత్ నీల్ వార్ కి దిగాడు

ఒకప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్, కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచమంతా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే బాహుబలి సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. వాస్తవానికి చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ మంచి ఆకలితో ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత రిలీజ్ అయిన సాహూ, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలు ప్రభాస్ అభిమానుల యొక్క ఆకలిని తీర్చలేదు.

అయితే ఇప్పుడు ప్రభాస్ నుంచి రాబోతున్న రెండు సినిమాలపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అందులో ఇదివరకే కేజిఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా ఒకటి. సలార్ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు హీరో కాకపోయినా కూడా కే జి ఎఫ్ వన్, కేజీఎఫ్ టు సినిమాలకి తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టి అద్భుతమైన కలెక్షన్లను అంటగట్టారు. ఇప్పుడు తెలుగు హీరో అయిన ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ఏ మేరకు అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అలానే ప్రభాస్ చేస్తున్న ఇంకో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ “ప్రాజెక్జ్- కే”. ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ నటిస్తుంది. ఇకపోతే ప్రాజెక్ట్ కే కి సంబంధించి ఏమైనా సోషల్ మీడియా వేదికగా లీక్ చేసి, షేర్ చేస్తే వాళ్లపై కేసు నమోదు చేస్తామంటూ ఇదివరకే ఆ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రశాంత్ ని ఏకంగా వార్ లోకి దిగిపోయాడు.

- Advertisement -

జరిగిన విషయం ఏమిటంటే సలార్ సినిమాకి సంబంధించిన అనధికారిక కంటెంట్ ను, సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసినందుకు ఒక ఇద్దరిని సైబర్ క్రైమ్ టీం అరెస్ట్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. ఏదేమైనా సలార్ టీం ఈ విషయంలో పకడ్బందీగా ఉంది అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో ఒక కంటెంట్ను షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చాలామందికి ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల యొక్క అంచనాలను అందుకుంటాయి. అనేది తెలియాలి అంటే రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు