Poonam Kaur : పవన్ పెళ్లిళ్ల గురించి మళ్ళీ పూనమ్ పంచ్?

Poonam Kaur : టాలీవుడ్ లో వివాదాలతో ఎక్కువ క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు. ఇప్పుడు ఈ హీరోయిన్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చూడ్డానికి క్యూట్ గా ఉండే ఈమె తన సినిమాల కంటే వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కి సంబంధించిన వివాదాలతో ఎక్కువగా వైరల్ అయింది. అయితే అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నా కలిసిరాకపోవడంతో పాలిటిక్స్ లో ఎక్కువగా బిజీ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఆమె తరచుగా సోషల్ మీడియా ద్వారా పేర్లు ప్రస్తావించకుండా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, పలువురిపై సెటైర్లు వేస్తూ గడిపేస్తుంటుంది. ఆ మధ్య ఏకంగా గురూజీ పేరును బయట పెడుతూ ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. తనకి ఏమాత్రం సమయం దొరికినా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై ముఖ్యంగా గురుజీపై ఎప్పుడు మండిపడుతూనే ఉంటుందని ఫ్యాన్స్ ఈమెని ట్రోల్ చేస్తూ ఉంటారు. గతంలో ఆమెకు సంబంధించిన ఆడియో క్లిప్పులు కొన్ని లీక్ అయ్యి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా పూనమ్ వేసిన ఓ పంచ్ పవన్ ని ఉద్దేశించి వేసిందేనని తెలుస్తుంది.

పవన్ జపం లో ఎల్లప్పుడూ..

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్‌ను సినిమాల పరంగా, రాజకీయంగా తరచుగా ఏదో రకంగా వ్యాఖ్యలు చేసే పూనమ్ కౌర్ (Poonam Kaur) తాజాగా మరో బాంబ్ పేల్చింది. అప్పట్లో వీరి మధ్య రిలేషన్షిప్ అని పలు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఇలాంటి గాసిప్స్ ని రాజకీయాల్లో వాడుకుంటున్నారు ఇతర నేతలు. దాన్ని దృష్టిలో ఉంచుకునే పూనమ్ ఎప్పుడు ఏం మాట్లాడినా ఇండస్ట్రీలో అందరూ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. చాలాసార్లు ఇన్ డైరెక్ట్‌గా పవన్ మీద ఎటాక్ చేసింది పూనమ్. ఐతే అప్పుడప్పుడూ పవన్‌కు అనుకూలంగా కూడా ఆమె వ్యాఖ్యలు చేస్తుంటుంది. కానీ పవన్ పేరు మాత్రం ఎత్తదు. తాజాగా ఆమె మరోసారి పవన్ టాపిక్‌తో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈసారి ఆమె ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ మీద పంచ్ వేయడానికి పవన్ టాపిక్‌ను ఇండైరెక్ట్ గా వాడుకుంది.

ఆ పంచ్ పవన్ కా? వాళ్ళకా?

ఇండియా లో ప్రఖ్యాత టెస్లా కంపెనీ ఇండియా లో ప్లాంట్ పెట్టాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. టెస్లా ఏపీకి రావచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక వైసీపీ మద్దతుదారు టెస్లాను ఏపీకి ఆహ్వానిస్తూ ఒక పోస్టు పెట్టాడు. అయితే ఆ ట్వీట్‌ను కోట్ చేస్తూ పూనమ్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. “మరి అతను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. అదేం సమస్య కాదు కదా” అని పూనమ్ కామెంట్ చేసింది. వైసీపీ నాయకులు సంబంధం లేకుండా ప్రతిసారీ పవన్ మూడు పెళ్ళిళ్ళ వ్యవహారాన్ని తెరమీదకి తెస్తుంటారు కదా! ఏపీలో సమస్యల గురించి మాట్లాడితే, పవన్ పెళ్ళిళ్ళ మీదే విమర్శలు చేస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ సహా అందరూ చేసేది ఇదే. ఈ నేపథ్యంలోనే పూనమ్ సెటైరిక్ గా ఈ ట్వీట్ పెట్టడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ పంచ్ వైసిపి వాళ్ళకే అయినా, అర్ధం కానీ పీకే ఫ్యాన్స్ ఈ పంచ్ పవన్ కి వేసారా? లేక ఆ పార్టీ వాళ్ళకి వేసారా అని తెలియక సతమతమవుతున్నారు. ఏది ఏమైనా మరోసారి పవన్ టాపిక్ తో పూనమ్ వార్తల్లో నిలిచింది. ఇక రాబోయే తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మరోసారి పూనమ్ బిజీ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు