MS Dhoni Second Movie : మరో మూవీకి రెడీ అవుతున్న ధోనీ… ఈసారైనా హిట్ అందుకుంటాడా?

MS Dhoni Second Movie : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. గత ఏడాది ఓ సినిమాను నిర్మించిన ధోనికి నిరాశ తప్పలేదు. అయినప్పటికీ పట్టుదలతో ఈ ఏడాది నిర్మాతగా తన రెండవ సినిమాతో మరో ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈసారన్నా ధోని హిట్ కొడతారా? అంటే…

ధోని రెండవ మూవీ ప్లాన్…

ఎంఎస్ ధోనికి క్రికెట్ తో సినిమాలపై కూడా మంచి ఆసక్తి ఉంది. అందుకే రిటైర్ అయ్యాక నిర్మాతగా మారి సినిమాలను తీయడం మొదలు పెట్టారు. మూవీస్ ను నిర్మించడానికే ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారాయన. ఈ బ్యానర్ లోనే గత ఏడాది ఓ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. ఎల్జిఎం (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే పేరుతో ఓ మూవీని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో కూడా ఈ మూవీకి నిరాశ తప్పలేదు. ఇప్పుడు ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి కన్నడ భాషలో మూవీని తీయడానికి ధోని సతీమణి సాక్షి సింగ్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఈ తాజా అప్డేట్ విన్న ధోని అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

కన్నడ ఇండస్ట్రీపై ధోని కన్ను

ఇటీవల కాలంలో కేజిఎఫ్, కాంతారా, చార్లీ 777 సినిమాలతో కన్నడ సినిమా స్పాన్ పెరిగింది. పాన్ ఇండియా రేంజ్ లో కన్నడ సినిమాలు సక్సెస్ ఫుల్ గా హిట్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి మూవీ వస్తోంది అంటే భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న శాండల్ వుడ్ పై ధోని కన్నేశారు అనే వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో ధోని నిర్మించబోతున్న ఆ కన్నడ మూవీలో హీరో హీరోయిన్లు ఎవరు? డైరెక్టర్ ఎవరు? మిగతా కాస్టింగ్ వివరాలు ఏంటి అనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. మొదటి మూవీతోనే నిర్మాతగా ఫ్లాప్ రుచి చూసిన ధోని ఈసారి రెండవ సినిమా విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మొదటి సినిమా తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. మరి ఈసారైనా ధోని సౌత్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథను పట్టుకుని హిట్ కొడతారా? అనేది చూడాలి.

- Advertisement -

ఐపిఎల్ లో బిజీ…

ప్రస్తుతం ధోని ఐపిఎల్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. చాలా కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ధోని ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజనే ధోని చివరి ఐపిఎల్ సీజన్ అనే టాక్ నడుస్తోంది. ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సినిమా నిర్మాణంపై ధోని పూర్తిగా దృష్టి సారిస్తాడని అంటున్నారు. ముఖ్యంగా దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి ధోని ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు