Meenakshi Chaudhary : టాలీవుడ్ హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి.. “ఇచట వాహనములు నిలపరాదు” సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఆ తరువాత మాస్ మహారాజా రవితేజతో కలిసి ఖిలాడి మూవీలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీ కి నిరాశ తప్పలేదు. ఆ తరువాత అడివి శేష్ సరసన హిట్ 2 మూవీలో నటించి మంచి విజయం అందుకుంది. ఇక ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించి ఎంతగానో పాపులర్ అయ్యింది మీనాక్షి. ఈ మూవీతో అటు తమిళ్ లో విజయ్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా దగ్గుబాటి హీరో సినిమాలో హీరోయిన్ గా ఓ అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఉగాది కానుకగా ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లుగా ఓ వార్త వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.