Karthikeya 2 : దిల్ రాజు వల్లే వాయిదా ?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హిట్ ఫ్లాప్ అని లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. “హైదరాబాద్ నవాబ్స్” చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు నిఖిల్. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “హ్యాపీడేస్” చిత్రంతో రాజేష్ గా పరిచయమై యువతలో మంచి పేరు సంపాదించుకున్నాడు. దీని తర్వాత నిఖిల్ నుండి మంచి సినిమాలే వచ్చాయి. చందు మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన చిత్రం “కార్తికేయ”. ఈ సినిమా చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ “కార్తికేయ 2” ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయింది. 5118 ఏళ్ల క్రితం నాటి యుగం అంతం సమయంలో ఒక అద్భుతమైన జ్ఞాన సంపద కనుమరుగు అవుతుంది. దానిని ఈ యుగంలో కొందరు చేజిక్కించుకోవడానికి చేసే అన్వేషణ అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేసింది.

అయితే ఈ సినిమాను జూలై 22న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేస్తామని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తాజా గా ఈ సినిమా రిలీజ్ డేట్ పై నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. జులై 29న గానీ, ఆగస్టు 5న లేదా, 12 తేదీలో ఎదో ఒకటి ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

- Advertisement -

ఇదిలా ఉండగా, ఈ సినిమాను జులై 22 నుండి వాయిదా వేయడానికి కారణం ఉందట. జులై 22న దిల్ రాజు నిర్మిస్తున్న “థాంక్యూ” సినిమా విడుదల కానుంది. దీంతో నిర్మాత దిల్ రాజు “కార్తికేయ 2” టీమ్ ని తమ సినిమాను వాయిదా వేయమని అడిగారట. “థాంక్యు” సినిమా కి సోలో రిలీజ్ వుండేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. అందువల్లే ఈ సినిమా వాయిదా పడిందని చిత్ర పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ సినిమా వాయిదా పడడంతో నిఖిల్ అభిమానులు కొంత నిరాశ చెందారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు