SSMB28: మలయాళీ విలన్

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB28 తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఆగష్టు లో సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలకు ఇప్పటికి మంచి స్పందన లభిస్తుంది. కానీ ఆయా చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. త్రివిక్రమ్ గత చిత్రాలు అరవింద సమేత వీర రాఘవ, అలవైకుంఠపురంలో బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్స్ వర్షం కురిపించాయి. ఇప్పుడు అదే దిశగా త్రివిక్రమ్ SSMB28 ను మలచబోతునట్లు తెలుస్తోంది.

భారీ కాస్టింగ్ ను , ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ను సినిమాలోని పాత్రలుగా వాడటం త్రివిక్రమ్ కు అలవాటు. ఇంతే కాకుండా పరభాష నటులను తీసుకొచ్చి తన సినిమాల్లో ప్రాముఖ్యమైన పాత్రను ఇస్తాడు త్రివిక్రమ్. అత్తారింటికి దారేది చిత్రంలో బోమన్ ఇరానీ, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర ను తీసుకొచ్చినట్లు. ఇప్పుడు SSMB28 చిత్రం కోసం మలయాళం స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ కోసం త్రివిక్రమ్ విలన్ పాత్రను రాసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వార్తలో ఏ మాత్రం నిజమున్న అంచనాలు ఇంకా పెరిగిపోతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు