బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు రోహిణి.. ఒకప్పుడు కామెడీ పాత్రలతో సీరియల్స్ లో మెప్పించి ఏకంగా నంది అవార్డులకు ప్రమోట్ అయిన ఈమె.. ఆ తర్వాత తన టాలెంట్ ను నమ్ముకుని జబర్దస్త్ వంటి కామెడీ షో లతో పాటు మరికొన్ని బుల్లితెర షోలలో కూడా పాల్గొంటూ.. తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు తన అద్భుతమైన టాలెంట్ తో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ఈమె..సినిమాలలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటూ బిజీగా మారింది.
రోహిణి సినిమా జీవితం..
రోహిణి సినిమా కెరియర్ విషయానికి వస్తే.. సినిమాలలో కూడా ఆఫర్లు అందుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను మెప్పించి.. తన క్రేజ్ పెంచుకున్న ఈమె తాజాగా గోపీచంద్ హీరోగా వస్తున్న భీమా సినిమాలో నటించింది. హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాని కేకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు.. ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా భీమా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా సుమా అడ్డా షోకే హాజరయ్యారు..
సుమా అడ్డా షోలో సందడి చేసిన భీమా టీమ్..
సినిమా ప్రమోషన్స్ భాగంగా.. భీమా టీమ్ నుంచీ గోపీచంద్, ప్రియా భవాని శంకర్, నిర్మాత కేకే రాధా మోహన్ , రోహిణి షోలో పాల్గొన్నారు. ఇందులో సుమా ప్రొడ్యూసర్ ప్రేమ గురించి తెలుసుకోవాలని ఉంది అని అడగ్గా.. దానికి రోహిణి నన్ను కూడా అడగండి.. అనడంతో.. నీకు ఎవరైనా క్రష్ ఉన్నారా? అని సుమా ప్రశ్నించింది.. దీంతో రోహిణి.. నాకు క్రష్ ఉన్నాడు.. నాకోసం రాధా మోహన్ నా స్కూల్ , కాలేజీ రోజుల్లో నా వెంటపడి తిరిగేవాడు.. అంటూ చెప్పుకొచ్చింది.. అంతేకాదు ఆయనతో కలిసి డాన్స్ స్టెప్స్ కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఇదంతా నిజమేనని ఆడియన్స్ కూడా నమ్మారు.. ఆ తర్వాత వెంటనే.. ఇదంతా షోలో భాగమని..రోహిణి తన కామెడీతో అందరిని ఆశ్చర్యపరిచిందని తెలిసి అందరూ కూల్ అయ్యారు.. ఇకపోతే ప్రొడ్యూసర్ తో లవ్ ట్రాక్ అనడంతో.. రోహిణి కామెంట్స్ నెట్టింట సెన్సేషనల్ గా మారాయి. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
గోపీచంద్ విషయానికి వస్తే..
2001లో తొలివలపు సినిమాతో హీరోగా కెరియర్ మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత జయం, నిజం, వర్షం సినిమాలలో విలన్ గా నటించి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు. అయితే 2004లో వచ్చిన యజ్ఞం సినిమాతో మళ్లీ హీరోగా యూ టర్న్ తీసుకున్న గోపీచంద్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చింది.. కానీ ఆ తర్వాత ఈయన నటించిన చిత్రాలు పెద్దగా విజయాన్ని అందించలేదు. దీంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు గోపీచంద్.. ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే భీమా సినిమా చేసి పర్వాలేదు అనిపించుకున్న గోపీచంద్.. ఇప్పుడు తన 32వ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.