Pawan Kalyan: బ్రో షూటింగ్ ఇంకా మిగిలే ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న “బ్రో” చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో నటిస్తుండడంతో ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర మోషన్ పోస్టర్ ఓ రేంజ్ లో ఉండి విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇక సినిమా డబ్బింగ్ పనుల్లో ఉందంటే చాలా మంది ఈ సినిమా షూటింగ్ ఇక అయిపోయినట్టే, జులై లో “బ్రో” విడుదలవడం కంఫర్మ్ అని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ఇంకా మిగిలే ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ముందుగా నమ్మలేకున్నా, తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ దగ్గర జరుగుతున్న షూటింగ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. ఆ స్టిల్స్ లో సాయి ధరమ్ తేజ్ ఉండగా , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా షూట్ బాకీ ఇంకా ఉండడంతో అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక “బ్రో” సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ పూర్తయిపోగా, సాయి కి సంబంధించిన షూట్ మాత్రమే ఉందంటూ సమాచారం. అన్ని పనులు పూర్తయ్యాకా “బ్రో” యొక్క అఫిషియల్ టీజర్ ని జూన్ చివరి వారంలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక “బ్రో” సినిమాని జులై 28 న విడుదల చేస్తున్నామని ఇంతకు ముందే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు