Tollywood : చూస్తూ ఊరుకోను తాట తీస్తా – దిల్ రాజు

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి నాలుగు బడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అందులో హనుమాన్ మీడియం రేంజ్ సినిమా అయినా, కంటెంట్ పరంగా పెద్ద సినిమాగానే రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాల్లో గుంటూరు కారం సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, హనుమాన్ ని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా సంక్రాంతి సినిమాల రిలీజ్ సందర్బంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాకి ఏ సినిమా అడ్డుగా రాకుండా తక్కువ థియేటర్లు ఇవ్వడమే కాకుండా చిన్న సినిమాలని దగ్గరుండి పోస్ట్ పోన్ చేయిస్తున్నాడని సోషల్ మీడియా లో తప్పుడు వార్తలు హల్చల్ చేసాయి.

ముఖ్యంగా లేటెస్ట్ గా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ దిల్ రాజు తో ఖైదీ నెంబర్ 150 టైం లో మాట్లాడిన ఓ సందర్భాన్ని గుర్తు చేసి ఓ విషయం చెప్పారు. దాన్ని పలు సోషల్ మీడియా వెబ్ సైట్స్ తప్పుడు రాతలుగా వక్రీకరించి రాసారని దిల్ రాజు ఫైర్ అయ్యాడు. లేటెస్ట్ గా ఓ ఫిల్మ్ ఈవెంట్ ప్రెస్ మీట్ కి వచ్చిన దిల్ రాజు ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ, తప్పుడు వార్తలు రాసిన పలు వెబ్ సైట్లపై మండి పడ్డారు.

- Advertisement -

దిల్ రాజు మాట్లాడుతూ హనుమాన్ ఈవెంట్ లో చిరంజీవి గారు అన్నది వేరే, మీడియా లో రాసింది వేరే.. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి గారు నా గురించి చాలా పాజిటివ్ గా చెప్పారు. కానీ రెండు ప్రముఖ వెబ్ సైట్లు కావాలని అది మార్చి నా గురించి నెగిటివ్ గా రాశారు. ఇన్నాళ్లూ ఊరుకున్నాను ఇక నుండీ నేను ఊరుకోను తాట తీస్తా అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఏది ఏమైనా దిల్ రాజు డిసైడ్ అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు థియేటర్ల సమస్య వస్తుందనేది వాస్తవం. అయితే తాజాగా దిల్ రాజు అన్న మాటలతో ఏకీభవించొచ్చు. దిల్ రాజు ని కావాలని ఎవరూ బ్లెమ్ చేయరన్నది కూడా నిజం. అయితే ఇలాంటి వార్తలను కొంచెం నిజ నిరూపణ చేసుకుని రాస్తే మంచిదని ట్రేడ్ పండితులు కూడా అంటున్నారు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు