RRR: సీక్వెల్ ని రాజమౌళి వదిలేసాడా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా సినిమాగా బ్లాక్ బస్టర్ అయ్యి ఇండియన్ సినిమాని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతుందని గతంలో వార్తలొచ్చాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మేరకు కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే, సీక్వెల్ విషయంలో తాజాగా ఒక ఆశ్చర్యకరమైన అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, RRR సీక్వెల్ ని రాజమౌళి డైరెక్ట్ చేయట్లేదట. ప్రస్తుతం మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న రాజమౌళి RRR సీక్వెల్ మీద దృష్టి పెట్టే టైమ్ ఉండదని అంటున్నారు.

రాజమౌళి ప్లేస్ లో వేరే డైరెక్టర్ అయితే, RRR పండిన ఎమోషన్ ని సీక్వెల్ లో రిపీట్ చేయగలడా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది సోషల్ మీడియాలో. సీక్వెల్ కోసం రాజమౌళి ఇండియన్ డైరెక్టర్స్ నే అప్రోచ్ అవుతారా లేక హాలీవుడ్ డైరెక్టర్స్ ని అప్రోచ్ అవుతాడా అన్నది కూడా ఆసక్తిగా మారింది. పార్ట్1 లో పాట్రియాటిక్ క్యారెక్టర్స్ తో ఫిక్షన్ ని సిద్ధం చేసిన విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ కోసం ఎలాంటి కథని తయారు చేస్తాడు అన్నది ఆసక్తికర అంశంగా మారింది.

మహేష్ బాబు, రాజమౌళి సినిమా రెండు భాగాలుగా ఉండబోతోందని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆ సినిమా పూర్తయ్యి రిలీజ్ అవ్వటానికి మినిమమ్ మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దీంతో తమ హీరోలు RRR సీక్వెల్ కోసం మళ్లీ రాజమౌళి చేతిలో పడితే, మూడేళ్ళ పాటు తమకు ఎదురు చూపులు తప్పవా అన్న ఆందోళన మొదలైంది అభిమానుల్లో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు