Actress Nushrratt Bharuccha
అప్పుడెప్పుడో 2019లో వచ్చిన డ్రీమ్ గర్ల్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్లో ఆయూష్మాన్ ఖూరానా, నష్రత బరుచా నటించగా, ఇప్పుడు నష్రత్ బరుచా స్థానంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండేని తీసుకున్నారు. దీనిపై మొదట్లో విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా దీనిపై నష్రత్ బరుచా స్పందించింది.
డ్రీమ్ గర్ల్ 2 లో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై చిత్ర యూనిట్ పై నష్రత్ అసహనం వ్యక్తం చేసింది. డ్రీమ్ గర్ల్ లో తానే హీరోయిన్ గా చేశానని, అప్పుడు ఆ చిత్రం మంచి విజయం సాధించిందని చెప్పింది. అయితే డ్రీమ్ గర్ల్ 2లో తనకు ఎందుకు ఛాన్స్ ఎవ్వలేదో మాత్రం తనకు తెలియదని నష్రత్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. చిత్ర యూనిట్ పై తనకు చాలా గౌరవం ఉందని, అయితే సీక్వెల్ లో తనకు ఛాన్స్ ఇవ్వకపోవడంపై బాధగా కూడా ఉందని చెప్పుకొచ్చింది.
అలాగే చిత్ర యూనిట్కి నటీనటుల ఎంపిక విషయంలో పూర్తి హక్కు ఉంటుందని చెప్పింది. అయితే తనకు కూడా ఛాన్స్ రాకపోవడంపై బాధపడే హక్కు, ఆ బాధను అందరికీ చెప్పే హక్కు కూడా ఉందని చెబుతూ తన బాధను వివరించింది. కాగా నుష్రత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె నుంచి అకెల్లి, చోరీ 2 సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News