Nagarjuna : అక్కినేని నాగార్జున, అమల మధ్య గొడవలు…కారణం ఇదే ?

Nagarjuna

అక్కినేని నాగార్జున ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తన నటనకుగాను ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. నాగార్జున సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇక ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత నాగార్జున అమలను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వివాహమైనప్పటి నుంచి ఈ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరికి అఖిల్ అనే కుమారుడు కూడా జన్మించాడు. నాగార్జున ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. కానీ విపరీతంగా డబ్బులను ఖర్చు చేస్తాడట. ఫ్రెండ్స్, పార్టీలు అంటూ చాలా డబ్బులని వృధా చేస్తాడట. ఈ విషయంలో అమలకి చాలా కోపం వస్తుందట. ఈ విషయంలో వీరిద్దరి మధ్య అసలు సఖ్యత ఉండదట.

ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారట. ఎలాంటి బిజినెస్ వ్యవహారాలలో ఎంత డబ్బు ఖర్చు చేయాలి అనే విషయాన్ని నాగార్జుననే స్వయంగా దగ్గరుండి చూసుకుంటారట. కానీ ఆ విషయంలో నాగార్జునకి అమల ఎప్పుడు అడ్డు చెబుతూనే ఉంటుందట. ప్రస్తుతానికి మనకు ఉన్న బిజినెస్ లు చాలు కొత్త బిజినెస్ లు చేయాల్సిన అవసరం లేదు అని వాదిస్తుందట. అయితే ప్రతి విషయంలో చాలా అన్యోన్యంగా ఉండే ఈ జంట ఈ ఒక్క విషయంలో మాత్రం గొడవపడతారట. డబ్బు విషయంలో అమల చాలా జాగ్రత్తగా ఉంటారట. కానీ నాగార్జున పూర్తిగా అమలకు వ్యతిరేకంగా డబ్బులను వృధా చేస్తారట. ఈ విషయం తెలిసిన నాగార్జున అభిమానులు ఎంతో అన్యోన్యంగా ఉండే మీరు కూడా గొడవలు పడుతూ ఉంటారా అని షాక్ అవుతున్నారట.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు