Biggboss season7: దోస్తాన్ గేమ్ మళ్ళీ మొదలుపెట్టావని నాకు తెలుసు- ప్రశాంత్!

స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 లో డబల్ ఎలిమినేషన్ తర్వాత మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక వీళ్ళ మధ్య ఈ వారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ వారం నుండి కెప్టెన్ కూడా ఎవ్వరూ ఉండరు కాబట్టి, ఒకర్ని నామినేట్ చేయకూడదు అని కాకుండా అందర్నీ నామినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఎవరికీ వారు గ్రూప్ గేమ్స్ ఆడడం మొదలుపెట్టారు.

అందులో స్పై బ్యాచ్ స్పా బ్యాచ్ ని, స్పా బ్యాచ్ స్పై బ్యాచ్ ని నామినేట్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ టీమ్ లో లేని అర్జున్, గౌతమ్ కూడా స్పై టీమ్ వల్లనే టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ నామినేషన్ ప్రాసెస్ లో ప్రశాంత్, శోభా ల మధ్య వాగ్వాదం గట్టిగా జరిగిందని తెలుస్తుంది.

అయితే ఇక్కడ శోభా శెట్టి ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ, ప్రశాంత్ వల్లే అమర్ కి కెప్టెన్సీ పోయిందని నామినేట్ చేసింది. అయితే అమర్ కి కెప్టెన్సీ పోవడానికి ఎవ్వరు కారణం కాదు, మెజారిటీ హౌస్ మేట్స్ అర్జున్ కి మద్దతు గా నిలిచారు కాబట్టి, ఎలాగైనా అమర్ ఒక్కసారి కెప్టెన్ కావాలని శోభా, ప్రియాంక పట్టుబట్టారు. అక్కడ ప్రశాంత్ మిస్టేక్ పెద్దగా ఏమిలేదు. ఇతర కంటెస్టెంట్స్ ఎలా సపోర్ట్ చేసారో, అలాగే ప్రశాంత్ అర్జున్ కి సపోర్ట్ చేసాడు.

- Advertisement -

కానీ ఈ పాయింట్ పై శోభా శెట్టి నామినేట్ చేయడంతో, మళ్ళీ దోస్తాన్ గేమ్ ఆడుతున్నావని, గ్రూప్ గేమ్ అంటే ఇదేనని వాదించాడు. అయితే ప్రోమోలో ప్రశాంత్ డిఫెండ్ చేస్తున్నా, శోభా బలవంతంగా కలర్ పూసి నామినేట్ చేయడానికి ట్రై చేసింది. మరి వీళ్ళ గొడవ ఎంత పీక్స్ కి వెళ్లిందో నైట్ షో టెలికాస్ట్ అయ్యాకే తెలుస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు