అక్కినేని హీరోలకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. ఆ ఇంట్లో హీరోలు ఎలాంటి సినిమాలు చేసినా అవి ఆడియన్స్ కు పెద్దగా ఎక్కడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి, అక్కినేని ఇంటి పరువు కాపాడాలని నాగార్జున చేస్తున్న సినిమా నా సామి రంగ. ఈ సినిమాలో నాగ్ అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై మాత్రమే కాదు, నాగ్ పాత్రపై కూడా అంచనాలను పెంచింది.
Read More:Nagarjuna: కింగ్కు అనుష్క ఎక్కడ పడిపోయిందంటే..?
అయితే ఈ సినిమాలో నటిస్తున్న వారి గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ, ఈ సినిమా మాత్రం మలయాళంలో వచ్చిన పొరింజు మరియం జోస్ కు రీమేక్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ పొరింజు మరియం జోస్ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇప్పుడు నా సామి రంగలో నాగార్జున ఒక హీరోగానే అనౌన్స్ చేశారు. కానీ, ఇటీవల నా సామి రంగలో రెండో హీరో ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
సెకండ్ హీరో పాత్రలో అల్లరి నరేష్ కనిపంచబోతున్నట్టు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు నా సామి రంగ సినిమాలో రెండో హీరో గురించి బిగ్ లీక్ వచ్చింది. జబర్థస్ ఫేం మహేష్ అచంట ఈ లీక్ ఇచ్చాడు. రీసెంట్ గా తన ఫేస్ బుక్ స్టోరీలో ఒక ఫోటోని యాడ్ చేశాడు. ఈ ఫోటోలో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నాడు. కింద క్యాప్షన్… going to Maisore #Naasamiranga Shoot With @Rajtaraun bro అంటూ రాసుకొచ్చాడు.
అంటే నా సామి రంగ సినిమాలో రాజ్ తరణ్ నటిస్తున్నాడని మహేష్ అచంట బిగ్ లీక్ ఇచ్చాడు అంటూ నాగ్ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, రాజ్ తరుణ్ గత కొన్ని రోజుల నుంచి సిల్వర్ స్క్రిన్ పై కనిపించడం లేదు. రాజ్ తరుణ్ లాస్ట్ మూవీ… స్టాడంప్ అప్ రాహుల్. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అంటే ఇప్పుడు నా సామి రంగ.. కేవలం నాగ్ కు మాత్రమే కాదు, రాజ్ తరుణ్ కి కూడా ముఖ్యం.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify
Big twist reveal about the second hero in naa Sami Ranga movie