ఎస్.ఎస్ రాజమౌళి.. ఈ దర్శకదీరుడి గురించి కేవలం మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ నుండి మొదలు పెడితే బాలీవుడ్, హాలీవుడ్ వరకు ఆయన ప్రతిభ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసింది.
స్టూడెంట్ నెంబర్ వన్ 1 తో మొదలుపెట్టి సింహాద్రి, మగధీర, ఈగ, బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ సినీ చరిత్రలో చరిగిపోని ముద్ర వేశారు జక్కన్న. రాజమౌళి తన దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 13 చిత్రాలను నిర్మించగా.. వాటిలో అన్ని సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ.. ఒక్క సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాలేకపోయింది. ఇంకా చెప్పాలంటే కాస్త నష్టాన్ని కూడా తెచ్చిపెట్టింది.
ఆ సినిమా మరేదో కాదు 2004 సెప్టెంబర్ 23న విడుదలైన “సై”. నితిన్ హీరోగా – జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కథ పరంగా సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం ఆశించిన స్థాయిలో లాభాలు తెచ్చి పెట్టలేక పోయింది. 8 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం లాంగ్ రన్ లో 12 కోట్లు సొంతం చేసుకుంది. అంటే కమర్షియల్ గా ఈ మూవీ పిట్టే కానీ.. కొన్ని ఏరియాలలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఆశించిన స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టలేదట.
ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఓ పాన్ వరల్డ్ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News