ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం క్లాస్ సినిమాలు వరుస బెట్టి రూపొందుతున్నాయి. టాప్ హీరోలు మినహా, మీడియం రేంజ్ హీరోలు చిన్న హీరోలు సైతం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలతో వస్తున్నారు. అయితే క్లాస్ సినిమాల విజయానికి కీలకం కథ,కథనాలు కీలకం అయితే, వాటికి మ్యూజిక్ ఆయువు పట్టు. రీసెంట్ గా వచ్చిన సార్, దసరా, సామజవరగమన వంటి సినిమాలకు ముందు హైప్ వచ్చింది పాటల ద్వారానే అని తెలిసిందే.
ఇప్పుడు టాలీవుడ్ లో ఇలాంటి క్లాస్ సినిమాలకి మ్యూజిక్ కు కేరాఫ్ గా మారుతున్నాడు ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అతనే “హేషం అబ్దుల్లా వాహబ్”. సౌదీ కి చెందిన ఇతను మలయాళం లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. అక్కడ మంచి మెలోడీ మ్యూజిక్ కు అబ్దుల్ కేరాఫ్ గా మారాడు. మధురం, హృదయం వంటి సినిమాల్తో మంచి క్రేజ్ సంపాదించుకున్న అబ్దుల్, ఈ ఏడాది “ఖుషి” సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమా ఛాన్స్ వచ్చిన రెండు మూడు నెలలకే, టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నాడు.
రీసెంట్ గా నాని నటిస్తున్న “హాయ్ నాన్న” సినిమాకు అబ్దుల్ ఛాన్స్ కొట్టేయగా, ఇప్పుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న 35వ సినిమాకు హేషం అబ్దుల్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు. ఇక త్వరలో ప్రభాస్ హనురాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు ఇతనే మ్యూజిక్ ఇస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఇక ఇవన్నీ క్లాస్ సినిమాలే కావడం విశేషం.
ఇదే జోరు కొనసాగితే టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన చక్రం తిప్పే అవకాశం ఉంది. మిక్కి జే మేయర్, గోపి సుందర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల లాగా క్లాస్ సినిమాలకి మ్యూజిక్ అందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని అవకాశాలు పొందుతాడో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News