టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సమంత… ఇదే సినిమా సమయంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంతల వివాహం జరిగింది. అయితే దాదాపు నాలుగు సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత అంటే 2021 చివర్లో విడిపోయారు. కారణాలు ఏవి చెప్పకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఇది ఇలా ఉండగా,
సమంత గత కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మళ్లీ వ్యాధి తిరగబడటంతో ఓ సంవత్సరం పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, సమంత తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ షేర్ చేసింది.
“జూలై 13 నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే సిటాడేల్ వెబ్ సిరీస్ పూర్తయింది” అనే క్యాప్షన్ జతచేసింది. అంతే కాకుండా ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు సమంత ఖుషి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుందా లేక చికిత్స తీసుకుంటుందా అని ఆలోచనలో పడ్డారు.