Radhe Shyam : ఫ్యాన్స్ ముచ్చట తీరుతుందా ?

బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కూడా డార్లింగ్ కు ఫ్యాన్ బేస్ భారీగానే వచ్చింది. దీంతో ప్రభాస్ నుండి పాన్ ఇండియా రేంజ్ లో మంచి సినిమాలను ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ, ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు దారుణంగా నిరాశపర్చాయి.

నిజానికి రాధేశ్యామ్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే, ప్రభాస్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ చేయాలని అనుకున్నారు. కానీ, రాధేశ్యామ్ అంచనాలు అందుకోకపోగా, ఇతర హీరోల ఫ్యాన్స్ నుండి ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ ట్రోల్స్ కు సమాధానం ఇవ్వాలని డార్లింగ్ ఫ్యాన్స్ అప్పటి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నారు.

రాధేశ్యామ్ థియేటర్ లో కాకున్నా, ఓటీటీలో అయినా, హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఓటీటీలో కూడా డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశే దగ్గింది. ఇప్పుడు మరోసారి రాధేశ్యామ్ ను ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంచడానికి అవకాశం వచ్చింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు ఛానల్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నెల చివరి వారంలో ఈ సినిమా జీ తెలుగులో ప్రసారం కాబోతుంది.

- Advertisement -

ఈ సినిమా ప్రసారం సమయంలో రికార్డు స్థాయిలో రేటింగ్ ఇవ్వాలని, టెలివిజన్ చరిత్రలో రాధేశ్యామ్ కు ఓ రికార్డు క్రియేట్ చేయాలని డార్లింగ్ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం టెలివిజన్ చరిత్రలో టీఆర్పీ పరంగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మొదటి స్థానంలో ఉండగా, సూపర్ స్టార్ మహేష్ బాబు సరి లేరు నీకెవ్వరు రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాల రికార్డులను బ్రేక్ చేసేలా రేటింగ్ వస్తే, ట్విట్టర్ లో ఇతర హీరోల ఫ్యాన్స్ కు కౌంటర్ ఇస్తూ, ప్రభాస్ ను ట్రెండ్ చేయాలని చూస్తున్నారు.

టెలివిజన్ తో అయినా, ప్రభాస్ ఫ్యాన్స్ ముచ్చట తీరుతుందా అంటే, రాధేశ్యామ్ టీవీల్లో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు