Bigboss telugu season 7: ఈ గ్రూపుల గోలేంది బాబూ?

Bigboss telugu season 7:

స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో ఎలిమినేటర్ గా రతిక వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఐదో వారం నామినేషన్ లో భాగంగా బిగ్ బాస్ తమ అభిప్రాయాలని పంచుకుంటూ, కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయమని చెప్పగా, అందులో తేజ అంతకు ముందు చేసిన తప్పులకు ఆటోమేటిక్ గా బిగ్ బాస్ స్వయంగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. కనుక ఇప్పుడు తేజ ని ఎవ్వరూ నామినేట్ చేసే అవసరం లేదు.

ఇకపోతే ఈ నామినేషన్ గొడవలో ఎక్కువగా గ్రూపులుగా విడిపోయి ఎదుటివారిని టార్గెట్ చేస్తూ, ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎక్కువ మంది కంటెస్టెంట్స్ భావిస్తున్నారు. ఇక హౌస్ లో మొత్తం పది మంది ఉండగా, తేజ ని పక్కన పెడితే, ప్రశాంత్, సందీప్, శోభా శెట్టి కంఫర్మ్ హౌస్ మేట్స్ కాబట్టి వాళ్ళు లెక్కలోకి రారు. ఇక శివాజీ తన పవర్ అస్త్ర కోల్పోయి మళ్ళీ కంటెస్టెంట్ అవగా, అమర్ దీప్, యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక వీళ్ళ మధ్యే నామినేషన్ల ప్రక్రియ జరిగింది.

అయితే వీళ్ళలో అమర్ దీప్, ప్రియాంక, తేజ, గౌతమ్ ఈ గ్రూప్ ల టాపిక్ తీసుకొచ్చారు. ఎదుటి వారిని ఎలిమినేట్ చేయడానికి అందరూ ఒక కంటెస్టెంట్ ని టార్గెట్ చేసి, ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే వ్యక్తి ని నామినేట్ చేద్దాం అంటూ మాట్లాడుకోడాన్ని గ్రూపిజం అంటారని తేజ అన్నాడు. ఆల్మోస్ట్ ఇదే టాపిక్ ని అమర్ దీప్, ప్రియాంకలు కూడా తమ పద్ధతిలో మాట్లాడడం జరిగింది. అయితే వేరే కారణాలు లేకుండా అందరూ ఈ గ్రూపుల టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నారని సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు