Bigboss season 7: బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో రైతు బిడ్డే గెలుస్తాడట..?

Bigboss season 7:

బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 7 మరింత రంజుగా తయారవుతుంది. ఈ సీజన్ లో అసలు కంటెస్టెంట్స్ అందరూ ముందుగా తమ కన్ఫర్మేషన్ కోసం పోరాడాల్సి వస్తుంది. అలా ఆడుతూనే టాస్క్ లని ఎదుర్కొంటూ, ఎలిమినేట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ నుండి ముగ్గురు ఎలిమినేట్ కాగా అందరూ ఫిమేల్స్ కావడం గమనార్హం. ఇక ఇప్పుడు ఆడుతున్న కంటెస్టెంట్స్ అందరూ, మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్న తరుణంలో బిగ్ బాస్ మరింత కష్టతరంగా టాస్క్ లు పెడుతున్నాడు.

ఈ క్రమంలో బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ పెట్టని వింత టాస్క్ ని ఈసారి సీజన్లో పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే కంటెస్టెంట్స్ బలవంతంగా ఏడుస్తూ వాళ్ళ కన్నీటి బొట్లను చిన్న గ్లాస్ లో నింపామని చెప్తాడు. ఎవరు ఎక్కువ కన్నీళ్లు నింపితే వాళ్ళు విన్ అవుతారని అంటాడు. ముందుగా ఫీల్ రాకుండా ఏడ్చే ప్రయత్నం చేసినా, ఎవరికీ కన్నీళ్లు రావు. ఆ తర్వాత వాళ్ళకి కన్నీళ్లొచ్చే సంఘటనని గుర్తు చేసుకుంటూ ఏడవడం మొదలెట్టారు. అందులో యావర్, అమర్ దీప్, తేజ ఎవరికీ వారు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు.

అయితే ఈ టాస్క్ లో మాత్రం విన్ అయ్యేది రైతు బిడ్డ ప్రశాంతేనని ఆడియన్స్ అంటున్నారు. ఎందుకంటే సీజన్ లో ఎక్కువ సార్లు సందర్భం ఉన్నా లేకపోయినా ఏడ్చింది ప్రశాంత్. ఇలాంటి టాస్క్ ప్రశాంత్ కి వస్తే గ్లాసులు కాదు, ఏకంగా బకెట్లు నింపేస్తాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ లో ప్రశాంత్ చేసిన పెర్ఫార్మన్స్ అలాంటిది మరి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు