Bigg Boss Telugu 7: హౌస్ మేట్స్ పై నాగార్జున ఫైర్ – పల్లవి ప్రశాంత్ పై ప్రశ్నల వర్షం

Bigg Boss Telugu 7

అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో కాసేపటి క్రితం రిలీజయ్యింది. ప్రోమోను బట్టి చూస్తే హౌస్ లో ఈ వారం జరిగిన విషయాలన్నింటిపై నాగార్జున గట్టిగానే ఫైర్ అయ్యారని తెలుస్తోంది. మరి ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పై ఐతే ఏకంగా నాగార్జున ఒక్క మొక్కని కూడా సరిగా పెంచలేని వాడివి నువ్వేం రైతు బిడ్డవని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గడిచిన ఈ వారం రోజులు హౌస్ లో జరిగిన విషయాలను బట్టి చూస్తే నాగార్జున ప్రశ్నించాల్సినవి చాలానే ఉన్నాయి. గత సోమవారం మొదలైన నామినేషన్ ప్రాసెస్ గొడవలు మొదలుకొని.. హౌస్ మేట్స్ అందరు టాస్క్ లో భాగంగా ఎదో విధంగా ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉన్నారు. మాములు డిస్కషన్స్ ను కూడా హౌస్ మేట్స్ఎక్కువ దూరం తీసుకెళ్తు అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు చేసారు. ఇక వారాంతంలో నైతే గౌతమ్ కృష్ణ మరియు ప్రిన్స్ యావర్ లు ఏకంగా కొట్టుకునేంతవరకు కూడా వెళ్లారు.

ఇక ఈ విషయాలన్నింటిపై నాగార్జున తనదైన స్టైల్ లో స్పందించినట్టు తెలుస్తోంది. హీరో శివాజీ మాటిమాటికి హౌస్ నుంచి వెళ్ళిపోతాను అనే విషయంపై కూడా నాగార్జున ఫైర్ అయ్యారు. అలాగే సోమవారం జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో పల్లవి ప్రశాంత్ పై అమరదీప్ నోరు పారేసుకోవడాన్ని కూడా నాగార్జున అడ్రెస్ చేసాడు. ఇక పల్లవి ప్రశాంత్
విషయంలో నాగార్జున సైలెన్స్ ను కూడా బ్రేక్ చేసి తాను గిఫ్ట్ గా ఇచ్చిన మొక్కను సరిగా చేసుకోలేని ప్రశాంత్.. నువ్వేం రైతు బిడ్డవి అని సీరియస్ అయ్యారు. అలాగే ప్రియాంక, షకీలా విషయంలో కూడా ఘాటుగానే స్పదించారు నాగార్జున. ఏది ఏమైనా ఈ ప్రోమోతో ఈరోజు ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పవచ్చు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు