Bigg boss season7: బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్.. ఎవరెవరంటే ?

Bigg boss season7

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇటీవలనే స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. గత ఆరు సీజన్ల నుంచి ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో ఇటీవలనే సీజన్ సెవెన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంతో పోలిస్తే ఈసారి సీజన్ కు వచ్చిన కంటిస్టెంట్స్ కాస్త మెరుగ్గా ఉండటంతో ప్రస్తుతం పాజిటివ్ వైబ్స్ తో ఈ షో ప్రేక్షకులను అలరిస్తుంది.

అయితే బిగ్ బాస్ ప్రతి సీజన్ లో హౌస్ మేట్స్ గరిష్టంగా 21 మంది మరియు కనిష్టంగా 16 మందితో షో స్టార్ట్ అయ్యేది. కానీ ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాత్రం కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో మాత్రమే ప్రారంభం అయింది. అయితే ఈ షో ప్రారంభం నుంచి నాగార్జున సీజన్ సెవెన్ ఉల్టా పల్టా గా ఉండబోతుందని చెబుతూ వస్తున్నట్టుగానే ఈ సీజన్  కాస్త అదే తరహాలో సాగుతుంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ అయ్యి వారం రోజులు గడవడానికి వస్తుండటంతో హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ ను ప్రవేశ పెట్టడానికి రెడీ అయ్యారు.

ఇక ఆయా కంటెస్టెంట్స్ వివరాలు చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి.
దేవత సీరియల్ ఫేం అర్జున్ అంబటి
యాంకర్ వర్షిణి
పవన్ సాయి రాజ్‌పుత్ (మళ్లీ సీరియల్ యాక్టర్ )
యాక్టర్ క్రాంతి (వారది, దునియా మూవీస్)
కాస్కో నిఖిల్ విజయేంద్ర సింహ
పూజా మూర్తి ( గుండమ్మ కథ సీరియల్ )
ఐశ్వర్య ( వివరాలు తెలియాల్సి ఉంది )
భోలే షావాలి (సింగర్ & మ్యూజిక్ డైరెక్టర్- చౌరస్తా, రక్షణ, స్వేచ్చ)
సీనియర్ హీరోయిన్ ఫర్జానా ( సీమ శాస్రి ఫేం )

- Advertisement -

పైన చెప్పబడిన కంటెస్టెంట్స్ అంత వచ్చే వారం నుంచి ఇద్దరిద్దరుగా జంటగా హౌస్‌లోకి వెళ్లనున్నట్టు సమాచారం అందుతోంది. అలాగే ప్రస్తుతం హౌస్ లో జరుగుతున్న 5 వారాల ఇమ్యునిటీ టాస్క్‌లో కూడా వీళ్ళు పాల్గొంటారని సమాచారం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు